Friday, 13 March 2026
  • Home  
  • సాంస్కృతిక కార్యక్రమాలతో సందడిగా ముచ్చువోలు జెడ్పీ పాఠశాల వార్షికోత్సవం
- తిరుపతి

సాంస్కృతిక కార్యక్రమాలతో సందడిగా ముచ్చువోలు జెడ్పీ పాఠశాల వార్షికోత్సవం

శ్రీకాళహస్తి మండలం ముచ్చువోలు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో వార్షికోత్సవం, 10వ తరగతి విద్యార్థులకు వీడ్కోలు కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు చిరంజీవి మాట్లాడుతూ…. పదో తరగతి విద్యార్థులు కష్టపడి చదివి ఉత్తీర్ణతలో అధిక శాతం సాధించాలని పదో తరగతి జీవితంలో తొలి మెట్టు, ఒక ముఖ్యమైన మైలురాయని పరీక్షల్లో మంచి ఫలితాలు సాధించి పాఠశాలకు, ఉపాధ్యాయులకు, తల్లిదండ్రులకు కీర్తి ప్రతిష్టలు తీసుకురావాలని పాఠశాలలో ఉపాధ్యాయుల మార్గదర్శకత్వంలో విద్యార్థులు మంచి జ్ఞానం సంపాదించి పరీక్షలకు సిద్ధమయ్యారని ఎలాంటి ఒత్తిడికి లోనుకాకుండా ధైర్యంగా పరీక్షలు రాసి తమ ప్రతిభను చాటాలని, సమాజంలో ఆదర్శంగా నిలవాలని విద్యార్థులకు ఆయన సూచించారు. అనంతరం విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాలు, ఆటపాటలతో కార్యక్రమాన్ని ఉత్సాహంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు డాక్టర్ సుబ్రహ్మణ్యం శర్మ, నరసింహులు, నాగరాజు, నిర్మల కుమారి, చంద్ర, పాఠశాల కమిటీ చైర్మన్, సభ్యులు, ప్రగతి స్వచ్ఛంద సంస్థ శ్రీకాళహస్తి మండల కన్వీనర్ చంద్రశేఖర్, తల్లిదండ్రులు, విద్యార్థులు పాల్గొన్నారు. అనంతరం విద్యార్థులు ఉపాధ్యాయులు, తల్లిదండ్రులకు పాదపూజ చేసి ఆశీర్వాదం పొందారు. విద్యార్థులకు ప్రధానోపాధ్యాయులు స్వీట్లు పంచి ఆనందాన్ని పంచుకున్నారు.

శ్రీకాళహస్తి మండలం ముచ్చువోలు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో వార్షికోత్సవం, 10వ తరగతి విద్యార్థులకు వీడ్కోలు కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు చిరంజీవి మాట్లాడుతూ…. పదో తరగతి విద్యార్థులు కష్టపడి చదివి ఉత్తీర్ణతలో అధిక శాతం సాధించాలని పదో తరగతి జీవితంలో తొలి మెట్టు, ఒక ముఖ్యమైన మైలురాయని పరీక్షల్లో మంచి ఫలితాలు సాధించి పాఠశాలకు, ఉపాధ్యాయులకు, తల్లిదండ్రులకు కీర్తి ప్రతిష్టలు తీసుకురావాలని పాఠశాలలో ఉపాధ్యాయుల మార్గదర్శకత్వంలో విద్యార్థులు మంచి జ్ఞానం సంపాదించి పరీక్షలకు సిద్ధమయ్యారని ఎలాంటి ఒత్తిడికి లోనుకాకుండా ధైర్యంగా పరీక్షలు రాసి తమ ప్రతిభను చాటాలని, సమాజంలో ఆదర్శంగా నిలవాలని విద్యార్థులకు ఆయన సూచించారు. అనంతరం విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాలు, ఆటపాటలతో కార్యక్రమాన్ని ఉత్సాహంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు డాక్టర్ సుబ్రహ్మణ్యం శర్మ, నరసింహులు, నాగరాజు, నిర్మల కుమారి, చంద్ర, పాఠశాల కమిటీ చైర్మన్, సభ్యులు, ప్రగతి స్వచ్ఛంద సంస్థ శ్రీకాళహస్తి మండల కన్వీనర్ చంద్రశేఖర్, తల్లిదండ్రులు, విద్యార్థులు పాల్గొన్నారు.
అనంతరం విద్యార్థులు ఉపాధ్యాయులు, తల్లిదండ్రులకు పాదపూజ చేసి ఆశీర్వాదం పొందారు. విద్యార్థులకు ప్రధానోపాధ్యాయులు స్వీట్లు పంచి ఆనందాన్ని పంచుకున్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.