శ్రీ సద్గురు సాయి నాథ్ మందిరం,సాయి నగర్ ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో 26వ వార్షికోత్సవ వేడుకలు శ్రద్ధాభక్తులతో నిర్వహించబడ్డాయి.ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో పూజా కార్యక్రమం, భక్తులకు స్వామి వారి దర్శన ఏర్పాట్లు, అనంతరం అన్నదానం కార్యక్రమం జరిగింది.ఈ కార్యక్రమంలో స్వర్ణేంద్రా మదర్ విక్టరీ స్కౌట్ గ్రూప్, నందలూరు సభ్యులు పాల్గొని సేవా కార్యక్రమాలు నిర్వహించారు.స్కౌట్ మాస్టర్ వేపగుంట సాంరాజ్ ఆధ్వర్యంలో 18 మంది స్కౌట్ సభ్యులు భక్తుల దర్శన క్యూలైన్ వ్యవస్థాపన, నీరు, ప్రసాదం పంపిణీ వంటి సేవల్లో పాల్గొన్నారు.గత 15 సంవత్సరాలుగా సాంరాజ్ మరియు వారి బృందం నిరంతరంగా సాయినాథ్ స్వామి సేవలో పాల్గొంటున్నారని ఆలయ కమిటీ సభ్యులు అభినందించారు.ఈ సందర్భంగా స్కౌట్ బృందాన్ని సన్మానించి ₹3,000/- ఆర్థిక సహాయం అందజేశారు.ఈ వేడుకలకు గౌరవ ముఖ్య అతిథిగా కె.సుబ్బరామి రెడ్డి, దేవస్థానం అధ్యక్షులు కె. కృష్ణమూర్తి,సభ్యులు ఎన్. శివరాజు తదితరులు హాజరై భక్తులతో కలిసి స్వామి వారి ఆశీర్వచనాలు పొందారు.

శ్రీ సద్గురు సాయినాథ్ మందిరం 26వ వార్షికోత్సవంలో స్కౌట్ సభ్యుల సేవా కార్యక్రమం
శ్రీ సద్గురు సాయి నాథ్ మందిరం,సాయి నగర్ ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో 26వ వార్షికోత్సవ వేడుకలు శ్రద్ధాభక్తులతో నిర్వహించబడ్డాయి.ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో పూజా కార్యక్రమం, భక్తులకు స్వామి వారి దర్శన ఏర్పాట్లు, అనంతరం అన్నదానం కార్యక్రమం జరిగింది.ఈ కార్యక్రమంలో స్వర్ణేంద్రా మదర్ విక్టరీ స్కౌట్ గ్రూప్, నందలూరు సభ్యులు పాల్గొని సేవా కార్యక్రమాలు నిర్వహించారు.స్కౌట్ మాస్టర్ వేపగుంట సాంరాజ్ ఆధ్వర్యంలో 18 మంది స్కౌట్ సభ్యులు భక్తుల దర్శన క్యూలైన్ వ్యవస్థాపన, నీరు, ప్రసాదం పంపిణీ వంటి సేవల్లో పాల్గొన్నారు.గత 15 సంవత్సరాలుగా సాంరాజ్ మరియు వారి బృందం నిరంతరంగా సాయినాథ్ స్వామి సేవలో పాల్గొంటున్నారని ఆలయ కమిటీ సభ్యులు అభినందించారు.ఈ సందర్భంగా స్కౌట్ బృందాన్ని సన్మానించి ₹3,000/- ఆర్థిక సహాయం అందజేశారు.ఈ వేడుకలకు గౌరవ ముఖ్య అతిథిగా కె.సుబ్బరామి రెడ్డి, దేవస్థానం అధ్యక్షులు కె. కృష్ణమూర్తి,సభ్యులు ఎన్. శివరాజు తదితరులు హాజరై భక్తులతో కలిసి స్వామి వారి ఆశీర్వచనాలు పొందారు.

