పెనుగొండ పట్టణం లోని నామా రామయ్య ఫంక్షన్ హాలులో మనం ఫౌండేషన్ మరియు శ్రీకృష్ణదేవరాయ చారిటబుల్ ట్రస్ట్ సంయుక్తంగా నిర్వహించిన “శ్రీకృష్ణదేవరాయ జాతీయ ఉత్తమ సేవా పురస్కారాలు”కార్యక్రమం ఆదివారం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో తెలుగు వెలుగు సాహిత్య,సామాజిక సేవా సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు ,కవి టి.వి.రెడ్డి కి ప్రముఖకవి,కళారత్న శ్రీ.బిక్కికృష్ణ ,మదర్ చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షులు శ్రీ.అశోక్ కుమార్ చేతులమీదుగా “శ్రీ కృష్ణదేవరాయ జాతీయ ఉత్తమ సేవా పురస్కారం”అందజేశారు.టి.వి.రెడ్డి మాట్లాడుతూ నాలుగు దశాబ్దాల ఉద్యోగ పర్వం అనంతరం విశ్రాంత జీవితంలో కూడా సాహిత్య,సామాజిక సేవలపై ఉన్న మక్కువ చేత “తెలుగు వెలుగు సాహిత్య,సామాజిక సేవా సంస్థను స్థాపించి,ఒంటరిగా ఏమిచేయలేము అనుకునే వారిని సేవా కార్యక్రమాలలో భాగస్వామ్యం చేస్తూ,”కలిసిఉందాం -కలుపుకుపోదాం”అనే లక్ష్యంతో అటు సాహిత్యంలోను,ఇటు సామాజికంగా అనేక సేవా కార్యక్రమాలు చేపట్టడం జరిగింది.ముఖ్యంగా కరోనా విజృంభించిన రోజులలో దేవుడికంటే మిన్నగా సేవలు చేస్తున్న పోలీసులకు,పారమెడికల్ సిబ్బందికి,పారిశుద్ద కార్మికులకు,పాత్రికేయులకు,వలస కార్మికులకు,నిరుపేదలకు టీ,బిస్కెట్స్, మాస్క్ లు,నిత్యావసర సరుకులు దాతల సహాయంతో పంపిణీ చేయడం జరిగింది.”కరోనాపై కలం” అంటూ జాతీయ స్థాయిలో ఆన్లైన్ లో కవి సమ్మేళనం నిర్వహించి బహుమతులతో కవులను ప్రోత్సహించాము.పై సేవలకు గుర్తింపుగా పురస్కారం అందుకున్నందులకు సహకరించిన మిత్రులందరికి కృతజ్ఞతలు తెలిపారు.
పెనుగొండ పట్టణం లోని నామా రామయ్య ఫంక్షన్ హాలులో మనం ఫౌండేషన్ మరియు శ్రీకృష్ణదేవరాయ చారిటబుల్ ట్రస్ట్ సంయుక్తంగా నిర్వహించిన “శ్రీకృష్ణదేవరాయ జాతీయ ఉత్తమ సేవా పురస్కారాలు”కార్యక్రమం ఆదివారం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో తెలుగు వెలుగు సాహిత్య,సామాజిక సేవా సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు ,కవి టి.వి.రెడ్డి కి ప్రముఖకవి,కళారత్న శ్రీ.బిక్కికృష్ణ ,మదర్ చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షులు శ్రీ.అశోక్ కుమార్ చేతులమీదుగా “శ్రీ కృష్ణదేవరాయ జాతీయ ఉత్తమ సేవా పురస్కారం”అందజేశారు.టి.వి.రెడ్డి మాట్లాడుతూ నాలుగు దశాబ్దాల ఉద్యోగ పర్వం అనంతరం విశ్రాంత జీవితంలో కూడా సాహిత్య,సామాజిక సేవలపై ఉన్న మక్కువ చేత “తెలుగు వెలుగు సాహిత్య,సామాజిక సేవా సంస్థను స్థాపించి,ఒంటరిగా ఏమిచేయలేము అనుకునే వారిని సేవా కార్యక్రమాలలో భాగస్వామ్యం చేస్తూ,”కలిసిఉందాం -కలుపుకుపోదాం”అనే లక్ష్యంతో అటు సాహిత్యంలోను,ఇటు సామాజికంగా అనేక సేవా కార్యక్రమాలు చేపట్టడం జరిగింది.ముఖ్యంగా కరోనా విజృంభించిన రోజులలో దేవుడికంటే మిన్నగా సేవలు చేస్తున్న పోలీసులకు,పారమెడికల్ సిబ్బందికి,పారిశుద్ద కార్మికులకు,పాత్రికేయులకు,వలస కార్మికులకు,నిరుపేదలకు టీ,బిస్కెట్స్, మాస్క్ లు,నిత్యావసర సరుకులు దాతల సహాయంతో పంపిణీ చేయడం జరిగింది.”కరోనాపై కలం” అంటూ జాతీయ స్థాయిలో ఆన్లైన్ లో కవి సమ్మేళనం నిర్వహించి బహుమతులతో కవులను ప్రోత్సహించాము.పై సేవలకు గుర్తింపుగా పురస్కారం అందుకున్నందులకు సహకరించిన మిత్రులందరికి కృతజ్ఞతలు తెలిపారు.

