శ్రీ కాలభైరవ ఆలయంలో జ్యేష్ఠ బహుళ అమావాస్య వేడుకలు ఘనంగా
అల్వాల్ ఇందిరానగర్ కంజిగూడ డైరీ ఫార్మ్ రోడ్లోని శ్రీ కాలభైరవ ఆలయంలో జ్యేష్ఠ బహుళ అమావాస్యను పురస్కరించుకొని కూష్మాండ దీపారాధన, అన్నదాన కార్యక్రమాలు భక్తిశ్రద్ధలతో నిర్వహించబడ్డాయి. ప్రధాన అర్చకులు శ్రీ ఎం. శివశంకర్ శర్మ ఆధ్వర్యంలో 300 మంది భక్తులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమం విజయవంతంగా జరగడానికి ఆలయ సేవకులు అందరూ సహకరించారు.

