పున్నమి రంగారెడ్డి జిల్లా ప్రతినిధి( సంగిశెట్టి ధనుంజయ్ ) జనవరి 03: సంస్థాన్ నారాయణపురం గ్రామ సర్పంచ్ ఉప్పల విజయలక్ష్మి లింగస్వామి ఆధ్వర్యంలో గ్రామాభివృద్ధి దిశగా మరో ముందడుగు పడింది. గ్రామంలోని ఐదవ, ఆరవ వార్డులలో పారిశుద్ధ్య కార్యక్రమాలు విజయవంతంగా నిర్వహించబడినవి. కాలువల శుభ్రత, చెత్త తొలగింపు, పరిశుభ్ర వాతావరణం కల్పించడంలో సర్పంచ్ చొరవ ప్రశంసనీయం.శుభ్రమైన గ్రామం – ఆరోగ్యకరమైన ప్రజలు అనే లక్ష్యంతో పాలకవర్గం నిరంతరం కృషి చేస్తోంది. గ్రామాభివృద్ధికి సహకరిస్తున్న ఉపసర్పంచ్ పల్లె మల్లారెడ్డి పాలకవర్గ సభ్యులు. పంచాయతీ కార్యదర్శి . మాజీ ప్రజాప్రతినిధులు, గ్రామ యువకులు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.
Uploaded Video:


