నెల్లూరు, ఏప్రిల్ 7 (పున్నమి ప్రతినిధి): ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాశ్వత రాజధానిగా అమరావతికి రాజముద్ర వేయడంపై నెల్లూరు జిల్లా నోబెల్ టీచర్స్ అసోసియేషన్ (NTA) హర్షం వ్యక్తం చేసింది. దేశాధినేత శ్రీమతి ద్రౌపది ముర్ము గారు తీసుకున్న ఈ నిర్ణయం రాష్ట్ర అభివృద్ధికి కీలక మైలురాయిగా నిలుస్తుందని పేర్కొంది. ఈ ప్రక్రియలో కీలక పాత్ర పోషించిన కేంద్ర ప్రభుత్వం, ముఖ్యంగా గౌ శ్రీ అమిత్ షా గారికి, అలాగే రాష్ట్ర కూటమి ప్రభుత్వానికి సంఘం ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపింది.
ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని వెంటనే 30 శాతం మధ్యంతర భృతి (IR) ప్రకటించాలని సంఘం వినమ్రంగా కోరింది.
నాటకం తిరుమలయ్య (అధ్యక్షులు), చెన్నయ్య (ప్రధాన కార్యదర్శి) ఈ మేరకు తెలిపారు

