పలమనేరు, జూన్23,2020 (పున్నమి విలేకరి): వైకాపా ప్రభుత్వం హయాంలోనే కాపులకు అన్ని విధాలుగా సంక్షేమ పథకాలతో పాటు ప్రత్యేక గుర్తింపు అందుతుందని రాష్ట్ర కాపు నాయకులు పోకల అశోక్ కుమార్ తెలిపారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కాపు కార్పొరేషన్ రాష్ట్ర బడ్జెట్లో రూ2847 కోట్లును కేటాయించడంపై హర్షం వ్యక్తం చేస్తూ పలమనేరులో బలిజ సంఘం ఆధ్వర్యంలో స్థానిక వ్యవసాయ మార్కెట్ కమిటీ వద్ద వైయస్ఆర్ విగ్రహానికి పూలమాలవేసి , ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమానికి పలమనేరు ఎమ్మెల్యే వెంకటే గౌడ , చిత్తూరు ఎంపీ రెడ్డప్ప ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కాపులకు అన్ని విధాలుగా అభివృద్ధి పరిచే సత్తా జగన్మోహన్ రెడ్డికి దక్కుతుందన్నారు. వైయస్సార్ కాపు నేస్తం పథకం కింద ప్రతి సంవత్సరం రూ15000వేల చొప్పున ఐదేళ్ళు లబ్దిదారులకు అందజేయడం జరుగుతున్న దన్నారు . వైయస్సార్ కాపు నేస్తం పథకం 45-60 ఏళ్ళు మధ్య వయసున్న మహిళల కాపు, బలిజ, తెలగ ఉప కులాలకు ఈ పథకం వర్తిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో కాపు నాయకులు సుదర్శన్ రాయల్,ఆకులు గజేంద్ర, జింక చలపతి,పలమనేరు బలిజ సంఘం అధ్యక్షుడు పి జె సి బాబు, ఏ సి బాబు, దైవ ప్రసాద్, కిరణ్, బాల గురునాథ్, నరేష్,హరీష్,రవి తదితరులు పాల్గొన్నారు.
వైకాపా ప్రభుత్వంలో కాపులకు ప్రత్యేక గుర్తింపు
పలమనేరు, జూన్23,2020 (పున్నమి విలేకరి): వైకాపా ప్రభుత్వం హయాంలోనే కాపులకు అన్ని విధాలుగా సంక్షేమ పథకాలతో పాటు ప్రత్యేక గుర్తింపు అందుతుందని రాష్ట్ర కాపు నాయకులు పోకల అశోక్ కుమార్ తెలిపారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కాపు కార్పొరేషన్ రాష్ట్ర బడ్జెట్లో రూ2847 కోట్లును కేటాయించడంపై హర్షం వ్యక్తం చేస్తూ పలమనేరులో బలిజ సంఘం ఆధ్వర్యంలో స్థానిక వ్యవసాయ మార్కెట్ కమిటీ వద్ద వైయస్ఆర్ విగ్రహానికి పూలమాలవేసి , ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమానికి పలమనేరు ఎమ్మెల్యే వెంకటే గౌడ , చిత్తూరు ఎంపీ రెడ్డప్ప ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కాపులకు అన్ని విధాలుగా అభివృద్ధి పరిచే సత్తా జగన్మోహన్ రెడ్డికి దక్కుతుందన్నారు. వైయస్సార్ కాపు నేస్తం పథకం కింద ప్రతి సంవత్సరం రూ15000వేల చొప్పున ఐదేళ్ళు లబ్దిదారులకు అందజేయడం జరుగుతున్న దన్నారు . వైయస్సార్ కాపు నేస్తం పథకం 45-60 ఏళ్ళు మధ్య వయసున్న మహిళల కాపు, బలిజ, తెలగ ఉప కులాలకు ఈ పథకం వర్తిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో కాపు నాయకులు సుదర్శన్ రాయల్,ఆకులు గజేంద్ర, జింక చలపతి,పలమనేరు బలిజ సంఘం అధ్యక్షుడు పి జె సి బాబు, ఏ సి బాబు, దైవ ప్రసాద్, కిరణ్, బాల గురునాథ్, నరేష్,హరీష్,రవి తదితరులు పాల్గొన్నారు.

