వేచలం, నవంబర్ 10 (సోమవారం):
కార్తీక మాసం మూడో సోమవారం సందర్భంగా వేచలం శివాలయంలో భక్తిశ్రద్ధలతో అన్నసంతర్పణ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తులు, గ్రామ ప్రజలు, చిన్నారులు పెద్ద సంఖ్యలో పాల్గొని భగవంతుని సేవలో తరించారు.
ఉదయం ప్రత్యేక పూజలు, హరతులతో ప్రారంభమైన ఈ వేడుకల్లో భక్తులు “హర హర మహాదేవ” నినాదాలతో ఆలయ ప్రాంగణం మార్మోగించారు. అనంతరం సాయంత్రం శివుని పల్లకి ఊరేగింపు కార్యక్రమం మేళతాళాలతో, దీప కాంతుల నడుమ భక్తి ఉత్సాహంగా సాగింది. పల్లకిని మోసే అదృష్టం పొందిన భక్తులు ఆనందభాష్పాలు కార్చగా, చిన్నారులు శివాలయం వద్ద తుప్పలు పీకుతూ పాల్గొనడం అందరినీ ఆకట్టుకుంది.
మూడో సోమవారం అన్నసమారాధన దాతలు:
1. వేచలపు నరసింహమూర్తి – 1 బియ్యం సంచి, 1 నూనె డబ్బా
2. బత్తి నాయుడు రెడ్డి శేఖర్ – బంగాళదుంప 80 కిలోలు
3. రెడ్డి శ్రీను, లెక్కల పరమేష్ – సెనగపిండి 12 కిలోలు
4. మెడికల్ నాయుడు – 1 బియ్యం బస్తా
5. ఆర్.వి.కె. నాయుడు – అరటిగెల ₹1000
6. రెడ్డి బుల్లిబాబు – 1 బియ్యం బస్తా
7. వేచలపు అప్పలనాయుడు టక్కు – 1 బియ్యం బస్తా
8. కరక రాంబాబు – 1 బియ్యం బస్తా
9. పొన్న సాంబయ్య జ్ఞాపకార్థం పొన్న పరమేష్ – ₹516
10. బోడబల్ల దేముడునాయుడు – 1 బియ్యం బస్తా
11. పైడా వెంకటరావు – 10 లీటర్ల పాలు
12. రెడ్డి అప్పారావు – ₹1016
13. వేచలపు బలరాం నాయుడు – ₹500
14. రెడ్డి నాయుడు మాస్టర్ – ₹1116
15. బొడ్డు సత్యవమ్మ, చీడికాడ – 1 బియ్యం బస్తా
16. నాగిరెడ్డి నాయుడు తాత – ₹1000
17. వేచలపు చిట్టినాయుడు రంగారావు – ₹1000
18. రెడ్డి లఖుహోం నాయుడు – 1 నూనె డబ్బా
19. వేచలపు కుమార్ – 1 నూనె డబ్బా
20. రెడ్డి కాళిదాసు – ₹1000
21. నౌడు అప్పారావు – ₹500
22. రెడ్డి గోవిందమ్మ (జ్యోతమ్మ) – ₹500
భక్తుల సహకారంతో సాఫల్యవంతంగా సాగిన ఈ కార్యక్రమం గ్రామంలో భక్తి వాతావరణాన్ని నెలకొల్పింది.


