శ్రీకాళహస్తి, ఏప్రిల్ 05 (పున్నమి న్యూస్): శ్రీకాళహస్తి పట్టణంలోని పిచ్చాటూరు రోడ్లో ఉన్న వీర బ్రహ్మంగారి దేవస్థానంలో విశ్వబ్రాహ్మణ కుటుంబ సభ్యుల సమావేశం ఘనంగా నిర్వహించారు. పట్టణ విశ్వబ్రాహ్మణ నాయకుడు ఎం. చంద్రచారి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంక్షేమ, అభివృద్ధి కార్పొరేషన్ డైరెక్టర్ డా. గుమ్మిడిపూడి దశరథ చారి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయనను విశ్వబ్రాహ్మణులు ఘనంగా సన్మానించారు. అనంతరం డా. దశరథ చారి మాట్లాడుతూ, విశ్వబ్రాహ్మణుల అభివృద్ధికి రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు పలు పథకాలు అందిస్తున్నాయని వివరించారు. ముఖ్యంగా పీఎంఈజీపీ పథకం ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో పరిశ్రమలు స్థాపించేందుకు సబ్సిడీతో కూడిన రుణాలు లభిస్తాయని, తయారీ రంగానికి రూ.50 లక్షలు, సేవా రంగానికి రూ.20 లక్షల వరకు సహాయం పొందవచ్చని తెలిపారు. ఈ పథకానికి ఖాదీ గ్రామీణ పరిశ్రమల కమిషన్, ఆంధ్రప్రదేశ్ గ్రామీణ పరిశ్రమల బోర్డు, జిల్లా పరిశ్రమల కేంద్రాలు సంయుక్తంగా అమలు చేస్తున్నాయని, ఆసక్తిగల వారు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. అదేవిధంగా హస్తకళాకారులు, స్వర్ణకారులు, కోయ బొమ్మల తయారీదారులు, ఎంబ్రాయిడరీ కళాకారులు తదితరులు చేనేత మరియు హస్తకళల శాఖ ద్వారా గుర్తింపు కార్డులు పొందవచ్చని తెలిపారు. ఎంఎస్ఎంఈ క్లస్టర్ డెవలప్మెంట్ పథకం ద్వారా సమూహంగా అభివృద్ధి చెందే అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నారు. విశ్వబ్రాహ్మణుల అభ్యున్నతికి తాను కట్టుబడి పనిచేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో వెంకయ్యచారి, రేణుకాదేవి, ఆనందాచారి, మంతుల నాగేంద్రచారి తదితరులు పాల్గొన్నారు. కార్పెంటర్లు, స్వర్ణకారులు, వివిధ హస్తకళాకారులు, రైతులు, వ్యాపారవేత్తలు సమావేశంలో హాజరయ్యారు.

విశ్వబ్రాహ్మణులాభివృద్ధికి ప్రభుత్వ పథకాల వినియోగం అవసరం-డా. దశరథ చారి
శ్రీకాళహస్తి, ఏప్రిల్ 05 (పున్నమి న్యూస్): శ్రీకాళహస్తి పట్టణంలోని పిచ్చాటూరు రోడ్లో ఉన్న వీర బ్రహ్మంగారి దేవస్థానంలో విశ్వబ్రాహ్మణ కుటుంబ సభ్యుల సమావేశం ఘనంగా నిర్వహించారు. పట్టణ విశ్వబ్రాహ్మణ నాయకుడు ఎం. చంద్రచారి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంక్షేమ, అభివృద్ధి కార్పొరేషన్ డైరెక్టర్ డా. గుమ్మిడిపూడి దశరథ చారి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయనను విశ్వబ్రాహ్మణులు ఘనంగా సన్మానించారు. అనంతరం డా. దశరథ చారి మాట్లాడుతూ, విశ్వబ్రాహ్మణుల అభివృద్ధికి రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు పలు పథకాలు అందిస్తున్నాయని వివరించారు. ముఖ్యంగా పీఎంఈజీపీ పథకం ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో పరిశ్రమలు స్థాపించేందుకు సబ్సిడీతో కూడిన రుణాలు లభిస్తాయని, తయారీ రంగానికి రూ.50 లక్షలు, సేవా రంగానికి రూ.20 లక్షల వరకు సహాయం పొందవచ్చని తెలిపారు. ఈ పథకానికి ఖాదీ గ్రామీణ పరిశ్రమల కమిషన్, ఆంధ్రప్రదేశ్ గ్రామీణ పరిశ్రమల బోర్డు, జిల్లా పరిశ్రమల కేంద్రాలు సంయుక్తంగా అమలు చేస్తున్నాయని, ఆసక్తిగల వారు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. అదేవిధంగా హస్తకళాకారులు, స్వర్ణకారులు, కోయ బొమ్మల తయారీదారులు, ఎంబ్రాయిడరీ కళాకారులు తదితరులు చేనేత మరియు హస్తకళల శాఖ ద్వారా గుర్తింపు కార్డులు పొందవచ్చని తెలిపారు. ఎంఎస్ఎంఈ క్లస్టర్ డెవలప్మెంట్ పథకం ద్వారా సమూహంగా అభివృద్ధి చెందే అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నారు. విశ్వబ్రాహ్మణుల అభ్యున్నతికి తాను కట్టుబడి పనిచేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో వెంకయ్యచారి, రేణుకాదేవి, ఆనందాచారి, మంతుల నాగేంద్రచారి తదితరులు పాల్గొన్నారు. కార్పెంటర్లు, స్వర్ణకారులు, వివిధ హస్తకళాకారులు, రైతులు, వ్యాపారవేత్తలు సమావేశంలో హాజరయ్యారు.

