విశాఖ జనవరి (పున్నమి ప్రతినిధి)
తెలంగాణ గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ విశాఖపట్నంలో తూర్పు నావిక దళానికి చెందిన అత్యాధునిక యుద్ధ నౌకలు, జలాంతర్గామిని ఆదివారం సందర్శించారు. ఈ సందర్భంగా నౌకాదళంలో కీలక పాత్ర పోషిస్తున్న INS హిమగిరితో పాటు, స్వదేశీ సాంకేతికతతో రూపొందించిన కల్వరి క్లాస్ జలాంతర్గామి INS ఖండేరీని ఆయన పరిశీలించారు.
భారతదేశ రక్షణ రంగంలో స్వయం సమృద్ధి సాధించే దిశగా జరుగుతున్న ప్రగతికి ఈ యుద్ధ నౌకలు, జలాంతర్గాములు నిదర్శనమని గవర్నర్ పేర్కొన్నారు. నౌకాదళ సిబ్బంది పనితీరును ఆయన అభినందిస్తూ, దేశ భద్రతకు వారి సేవలు అమూల్యమని ప్రశంసించారు.



