*విశాఖ ఉత్తర నియోజకవర్గం 24వార్డు ఆక్సిజన్ టవర్స్ వద్ద కోటి సంతకాలు సేకరణ కార్యక్రమంలో పాల్గొన్న – శ్రీ కె.కె రాజు ..*
*విశాఖపట్నం పున్నమి ప్రతినిధి *
ఈరోజు విశాఖ ఉత్తర నియోజకవర్గం 24 వార్డు పరిధి ఆక్సిజన్ టవర్స్ వద్ద SEC మెంబర్ శ్రీ సతీష్ వర్మ గారి ఆధ్వర్యంలో ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కోటి సంతకాల సేకరణ జరిగింది.ఈ కార్యక్రమంలో విశాఖపట్నం జిల్లా అధ్యక్షులు విశాఖ ఉత్తర నియోజకవర్గ సమన్వయకర్త *శ్రీ కె.కె రాజు గారు..* పాల్గొని విద్యార్థులు, మేధావులు, ప్రజలు వద్ద నుండి సంతకాలు స్వీకరించారు.
ఈ కార్యక్రమంలో మాజీ మంత్రివర్యులు పి. బాలరాజు గారు 24 వార్డు కార్పొరేటర్ స్టాండింగ్ కమిటీ మెంబర్ శ్రీ మతి సాడి పద్మ రెడ్డి, జిల్లా మహిళా అధ్యక్షురాలు పెడడా రమణి కుమారి అలంపల్లి రాజుబాబు, పేరాల విజయ్ చంద్ర, శ్రీదేవి వర్మ,24 వార్డు అధ్యక్షుడు అశోక్ రెడ్డి, మరియు తదితరులు పాల్గొన్నారు.


