శ్రీకాళహస్తి పున్నమి న్యూస్, డిసెంబర్ 27: శ్రీకాళహస్తి పట్టణంలోని విద్యా జ్యోతి పబ్లిక్ స్కూల్ నందు వీర బాల దివస్ కార్యక్రమాన్ని బిజెపి తిరుపతి జిల్లా మాజీ అధ్యక్షులు డాక్టర్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులను ఉద్దేశించి డాక్టర్ చంద్రప్ప మాట్లాడుతూ.. ప్రధాని నరేంద్ర మోడీ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం జనవరి 9న 2022వ సంవత్సరం ఈ మేర గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసిందని తెలిపారు, చరిత్రపుటల్లో అనేకమంది భరతమాత స్వేచ్ఛ కోసం సంస్కృతి యొక్క రక్షణ కోసం తమ ప్రాణాలను తృణపాయంగా అర్పించారని ఆకోవలో పెద్దలే కాదు చిన్నారులు కూడా ఉన్నారని వారే బాబా జోరవర్ సింగ్, బాబా పతే సింగ్ వీరు పదవ సిక్కు గురువు అయినటువంటి శ్రీ గురు గోబింద్ జీ చిన్న కుమారులు ఆ చిన్నారుల ధైర్య సాహసాలని, త్యాగనిరతిని స్మరించుకుంటూ అటువంటి వీరపుత్రులను కన్న మాతృమూర్తులను నమస్కరించుకుంటూ దేశవ్యాప్తంగా 26 డిసెంబర్ న వీర బాల దివస్ గా జరుపుకుంటున్నామని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బిజెపి మహిళా నాయకురాలు కండ్రిగ ఉమా, పాఠశాల అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.

విద్యా జ్యోతి పాఠశాలలో వీర బాల దివస్ కార్యక్రమం
శ్రీకాళహస్తి పున్నమి న్యూస్, డిసెంబర్ 27: శ్రీకాళహస్తి పట్టణంలోని విద్యా జ్యోతి పబ్లిక్ స్కూల్ నందు వీర బాల దివస్ కార్యక్రమాన్ని బిజెపి తిరుపతి జిల్లా మాజీ అధ్యక్షులు డాక్టర్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులను ఉద్దేశించి డాక్టర్ చంద్రప్ప మాట్లాడుతూ.. ప్రధాని నరేంద్ర మోడీ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం జనవరి 9న 2022వ సంవత్సరం ఈ మేర గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసిందని తెలిపారు, చరిత్రపుటల్లో అనేకమంది భరతమాత స్వేచ్ఛ కోసం సంస్కృతి యొక్క రక్షణ కోసం తమ ప్రాణాలను తృణపాయంగా అర్పించారని ఆకోవలో పెద్దలే కాదు చిన్నారులు కూడా ఉన్నారని వారే బాబా జోరవర్ సింగ్, బాబా పతే సింగ్ వీరు పదవ సిక్కు గురువు అయినటువంటి శ్రీ గురు గోబింద్ జీ చిన్న కుమారులు ఆ చిన్నారుల ధైర్య సాహసాలని, త్యాగనిరతిని స్మరించుకుంటూ అటువంటి వీరపుత్రులను కన్న మాతృమూర్తులను నమస్కరించుకుంటూ దేశవ్యాప్తంగా 26 డిసెంబర్ న వీర బాల దివస్ గా జరుపుకుంటున్నామని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బిజెపి మహిళా నాయకురాలు కండ్రిగ ఉమా, పాఠశాల అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.

