ఏర్పేడు, ఏప్రిల్ 07 (పున్నమి న్యూస్): ఏర్పేడు మండలంలోని పాపనాయుడుపేటలో గురువారం నాడు జరిగిన నిశ్చితార్థ వేడుక రాజకీయ ప్రముఖుల రాకతో సందడిగా మారింది. స్టార్ అంబేద్కర్ కృష్ణ కుమార్తెకు, పూతలపట్టు మాజీ శాసనసభ్యులు ఎం.ఎస్. బాబు కుమారుడికి నిశ్చితార్థం ఘనంగా నిర్వహించారు. ఈ శుభకార్యానికి తిరుపతి పార్లమెంట్ సభ్యులు మద్దిల గురుమూర్తి, శ్రీకాళహస్తి మాజీ శాసనసభ్యులు బియ్యపు మధుసూదన్ రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. వధూవరులను పూలమాలలతో అభినందించి, భవిష్యత్తులో వారు సుఖసంతోషాలతో ఉండాలని ఎంపీ మరియు మాజీ ఎమ్మెల్యే ఆకాంక్షించారు. ఈ సందర్భంగా ఎమ్మెస్ బాబు కుటుంబ సభ్యులతో వారు కాసేపు ముచ్చటించారు. ఈ కార్యక్రమంలో శ్రీకాళహస్తి దేవస్థానం ట్రస్ట్ బోర్డు మాజీ చైర్మన్ అంజూరు తారక శ్రీనివాసులు, మాజీ బోర్డు సభ్యులు మున్నా రాయల్, పైపూరి రంగయ్య, మస్తాన్, డి.జె. సుధీర్, ధనంజయ రెడ్డి, నాగరాజు రెడ్డి, మణి, తిరుపాల్, ఈశ్వర్, గోపి, సునీల్, పఠాన్ ఫరీడ్, పి.ఎం. చంద్ర, కొనతనేరి గురవయ్య, మాజీ కౌన్సిలర్ కిషోర్, ఇతర నాయకులు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

వధూవరులను ఆశీర్వదించిన ఎంపీ గురుమూర్తి, మాజీ ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి
ఏర్పేడు, ఏప్రిల్ 07 (పున్నమి న్యూస్): ఏర్పేడు మండలంలోని పాపనాయుడుపేటలో గురువారం నాడు జరిగిన నిశ్చితార్థ వేడుక రాజకీయ ప్రముఖుల రాకతో సందడిగా మారింది. స్టార్ అంబేద్కర్ కృష్ణ కుమార్తెకు, పూతలపట్టు మాజీ శాసనసభ్యులు ఎం.ఎస్. బాబు కుమారుడికి నిశ్చితార్థం ఘనంగా నిర్వహించారు. ఈ శుభకార్యానికి తిరుపతి పార్లమెంట్ సభ్యులు మద్దిల గురుమూర్తి, శ్రీకాళహస్తి మాజీ శాసనసభ్యులు బియ్యపు మధుసూదన్ రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. వధూవరులను పూలమాలలతో అభినందించి, భవిష్యత్తులో వారు సుఖసంతోషాలతో ఉండాలని ఎంపీ మరియు మాజీ ఎమ్మెల్యే ఆకాంక్షించారు. ఈ సందర్భంగా ఎమ్మెస్ బాబు కుటుంబ సభ్యులతో వారు కాసేపు ముచ్చటించారు. ఈ కార్యక్రమంలో శ్రీకాళహస్తి దేవస్థానం ట్రస్ట్ బోర్డు మాజీ చైర్మన్ అంజూరు తారక శ్రీనివాసులు, మాజీ బోర్డు సభ్యులు మున్నా రాయల్, పైపూరి రంగయ్య, మస్తాన్, డి.జె. సుధీర్, ధనంజయ రెడ్డి, నాగరాజు రెడ్డి, మణి, తిరుపాల్, ఈశ్వర్, గోపి, సునీల్, పఠాన్ ఫరీడ్, పి.ఎం. చంద్ర, కొనతనేరి గురవయ్య, మాజీ కౌన్సిలర్ కిషోర్, ఇతర నాయకులు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

