శ్రీకాళహస్తి, మార్చి 16 (పున్నమి న్యూస్): దేశవ్యాప్తంగా వంట నూనెల ధరలు రోజురోజుకు పెరుగుతూ సామాన్య ప్రజలకు భారంగా మారుతున్నాయి. ముఖ్యంగా సన్ఫ్లవర్ నూనె ధరలు గణనీయంగా పెరగడంతో కుటుంబాల నెలవారీ ఖర్చులు పెరిగిపోతున్నాయి. ఇటీవల వరకు ఆన్లైన్ మార్కెట్లో సన్ఫ్లవర్ నూనె లీటర్ ధర సుమారు రూ.152గా ఉండగా, ప్రస్తుతం అది రూ.174 నుంచి రూ.178 వరకు చేరింది. ఇక స్థానికంగా ఉన్న సూపర్ మార్కెట్లు, కిరాణా దుకాణాల్లో కూడా లీటర్కు రూ.165 నుంచి రూ.168 వరకు విక్రయిస్తున్నారు. ధరలు పెరగడంతో పాటు సన్ఫ్లవర్ నూనెకు డిమాండ్ ఎక్కువగా ఉండటంతో సరఫరా తగ్గిపోయి పలు దుకాణాల్లో “నో స్టాక్” బోర్డులు కూడా కనిపిస్తున్నాయి. ఇక పల్లీ నూనె ధరలు కూడా సామాన్యులకు అందనంత స్థాయికి చేరుతున్నాయి. ప్రస్తుతం పల్లీ నూనె లీటర్ ధర రూ.220కు పైగానే మార్కెట్లో విక్రయిస్తున్నారు. దీంతో వంట నూనెల కొనుగోలు విషయంలో ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వ్యాపార వర్గాల సమాచారం ప్రకారం అంతర్జాతీయ పరిస్థితులు, ముఖ్యంగా గల్ఫ్ ప్రాంతంలో కొనసాగుతున్న ఉద్రిక్తతలు మార్కెట్పై ప్రభావం చూపుతున్నాయని చెబుతున్నారు. అక్కడి పరిస్థితులు మరికొంతకాలం కొనసాగితే వంట నూనెల ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని వ్యాపారులు అంచనా వేస్తున్నారు. ధరల పెరుగుదల నేపథ్యంలో ప్రభుత్వాలు తగిన చర్యలు తీసుకుని సామాన్య ప్రజలకు ఉపశమనం కల్పించాలని వినియోగదారులు కోరుతున్నారు.

వంట నూనె ధరల మంట… సామాన్యులకు భారంగా పెరుగుతున్న ఖర్చులు
శ్రీకాళహస్తి, మార్చి 16 (పున్నమి న్యూస్): దేశవ్యాప్తంగా వంట నూనెల ధరలు రోజురోజుకు పెరుగుతూ సామాన్య ప్రజలకు భారంగా మారుతున్నాయి. ముఖ్యంగా సన్ఫ్లవర్ నూనె ధరలు గణనీయంగా పెరగడంతో కుటుంబాల నెలవారీ ఖర్చులు పెరిగిపోతున్నాయి. ఇటీవల వరకు ఆన్లైన్ మార్కెట్లో సన్ఫ్లవర్ నూనె లీటర్ ధర సుమారు రూ.152గా ఉండగా, ప్రస్తుతం అది రూ.174 నుంచి రూ.178 వరకు చేరింది. ఇక స్థానికంగా ఉన్న సూపర్ మార్కెట్లు, కిరాణా దుకాణాల్లో కూడా లీటర్కు రూ.165 నుంచి రూ.168 వరకు విక్రయిస్తున్నారు. ధరలు పెరగడంతో పాటు సన్ఫ్లవర్ నూనెకు డిమాండ్ ఎక్కువగా ఉండటంతో సరఫరా తగ్గిపోయి పలు దుకాణాల్లో “నో స్టాక్” బోర్డులు కూడా కనిపిస్తున్నాయి. ఇక పల్లీ నూనె ధరలు కూడా సామాన్యులకు అందనంత స్థాయికి చేరుతున్నాయి. ప్రస్తుతం పల్లీ నూనె లీటర్ ధర రూ.220కు పైగానే మార్కెట్లో విక్రయిస్తున్నారు. దీంతో వంట నూనెల కొనుగోలు విషయంలో ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వ్యాపార వర్గాల సమాచారం ప్రకారం అంతర్జాతీయ పరిస్థితులు, ముఖ్యంగా గల్ఫ్ ప్రాంతంలో కొనసాగుతున్న ఉద్రిక్తతలు మార్కెట్పై ప్రభావం చూపుతున్నాయని చెబుతున్నారు. అక్కడి పరిస్థితులు మరికొంతకాలం కొనసాగితే వంట నూనెల ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని వ్యాపారులు అంచనా వేస్తున్నారు. ధరల పెరుగుదల నేపథ్యంలో ప్రభుత్వాలు తగిన చర్యలు తీసుకుని సామాన్య ప్రజలకు ఉపశమనం కల్పించాలని వినియోగదారులు కోరుతున్నారు.

