భైంసా: గోపాల్ రావు పాటిల్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల, భైంసాలో నిర్వహిస్తున్న సర్టిఫికెట్ కోర్సు
*లైఫ్ స్కిల్స్* కార్యక్రమంలో భాగంగా “స్ట్రెస్ మేనేజ్మెంట్” పై అవగాహన సదస్సు ఘనంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన డాక్టర్ అల్లాడి సురేష్ గారు (సైక్రియాట్రిస్ట్) విద్యార్థులతో మాట్లాడుతూ — ఆరోగ్యకరమైన జీవనశైలి, సానుకూల ఆలోచన, సమతుల ఆహారం, మరియు వ్యాయామం మానసిక ప్రశాంతతకు మూలస్తంభాలని వివరించారు. విద్యార్థులు చదువుతో పాటు మానసిక ఆరోగ్యంపై కూడా దృష్టి పెట్టాలని సూచించారు.
కార్యక్రమానికి వైస్ ప్రిన్సిపాల్ కే రఘునాథ్ గారు అధ్యక్షత వహించారు. ఈ అవగాహన సదస్సును రసాయనశాస్త్రం, ఇంగ్లీష్, జంతుశాస్త్రం మరియు భౌతిక శాస్త్రం విభాగాలు సంయుక్తంగా నిర్వహించాయి
కార్యక్రమంలో అధ్యాపకులు, డాక్టర్ బీమా రావు,రవికుమార్ డాక్టర్ శంకర్ ఎ రాజు, డాక్టర్ ఓం ప్రకాష్ డాక్టర్ కోసారి సంతోష్ డాక్టర్ కల్పన డాక్టర్ నహీదా, దివ్య, శ్రావణ్య,కిషన్ రాజయ్య రామ్మోహన్ అబ్దుల్లా వాహిద్ ఇర్ఫాన్ ఉజుమా, విద్విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొని చురుకైన ఆసక్తి కనబరిచారు. కార్యక్రమం విజయవంతంగా ముగిసింది.


