చిత్తూరు జిల్లా ఎస్పీ తుషార్ దూడి ఆదేశాల మేరకు అర్బన్ సీఐ మురళీ మోహన్ ఆధ్వర్యంలో ఎస్ఐ లోకేష్ రెడ్డితో కలిసి పలమనేరులోని పలు లాడ్జిల్లో గురువారం రాత్రి ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐ మురళీ మోహన్ మాట్లాడుతూ రాత్రి వేళల్లో లాడ్జిలులో బస చేసిన వ్యక్తల వివారాలను పరిశీలించి, కోత్త వ్యక్తులను ప్రశ్నిస్తూ వివరాలపై ఆరా తీశారు. అదేవిధంగా రాత్రి వేళలో బస చేసిన ప్రయాణికులను తనిఖీ చేసి అనుమానిత వ్యక్తుల వివరాలు సేకరించి నేర నియంత్రణకు పటిష్ట చర్యలు తీసుకుంటుమన్నారు. లాడ్జీల్లో బస చేసే వ్యక్తుల నుంచి ఆధార్ కార్డులు, ఇతర వివరాల కోసం సరైన రిజిస్టర్ నిర్వహించాలని నిర్వహకులకు సీఐ సూచించారు. చట్ట విరుద్ధంగా ఎవరికీ గదులు ఇవ్వరాదని, లాడ్జి పరిసరాలు స్పష్టంగా కన్పించేలా తప్పనిసరిగా సి.సి.కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలన్నారు. అనుమానాస్పద వ్యక్తులు లాడ్జిల్లో బస చేసిన సమయంలో పోలీసులకు సమాచారం ఇవ్వాలన్నారు. లాడ్జిల్లో ఎలాంటి చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు తావిచ్చినా చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.

లాడ్జిలను ఆకస్మికంగా తనిఖీలు చేసిన సీఐ
చిత్తూరు జిల్లా ఎస్పీ తుషార్ దూడి ఆదేశాల మేరకు అర్బన్ సీఐ మురళీ మోహన్ ఆధ్వర్యంలో ఎస్ఐ లోకేష్ రెడ్డితో కలిసి పలమనేరులోని పలు లాడ్జిల్లో గురువారం రాత్రి ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐ మురళీ మోహన్ మాట్లాడుతూ రాత్రి వేళల్లో లాడ్జిలులో బస చేసిన వ్యక్తల వివారాలను పరిశీలించి, కోత్త వ్యక్తులను ప్రశ్నిస్తూ వివరాలపై ఆరా తీశారు. అదేవిధంగా రాత్రి వేళలో బస చేసిన ప్రయాణికులను తనిఖీ చేసి అనుమానిత వ్యక్తుల వివరాలు సేకరించి నేర నియంత్రణకు పటిష్ట చర్యలు తీసుకుంటుమన్నారు. లాడ్జీల్లో బస చేసే వ్యక్తుల నుంచి ఆధార్ కార్డులు, ఇతర వివరాల కోసం సరైన రిజిస్టర్ నిర్వహించాలని నిర్వహకులకు సీఐ సూచించారు. చట్ట విరుద్ధంగా ఎవరికీ గదులు ఇవ్వరాదని, లాడ్జి పరిసరాలు స్పష్టంగా కన్పించేలా తప్పనిసరిగా సి.సి.కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలన్నారు. అనుమానాస్పద వ్యక్తులు లాడ్జిల్లో బస చేసిన సమయంలో పోలీసులకు సమాచారం ఇవ్వాలన్నారు. లాడ్జిల్లో ఎలాంటి చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు తావిచ్చినా చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.

