Tuesday, 9 December 2025
  • Home  
  • లక్ష ఎకరాల్లో ఉద్యానవన పంటలు సాగే లక్ష్యం :కలెక్టర్ చక్రధర్ బాబు
- Featured

లక్ష ఎకరాల్లో ఉద్యానవన పంటలు సాగే లక్ష్యం :కలెక్టర్ చక్రధర్ బాబు

మనుబోలు (పున్నమి విలేఖరి) 13 ,అక్టోబర్ : నెల్లూరు జిల్లాలో 57వేల హెక్టార్లలో ఉద్యాన పంటల సాగు జరుగుతుందని లక్ష హెక్టార్లలో చేర్చడమే లక్ష్యమని జిల్లా కలెక్టర్ చక్రధర్ పేర్కొన్నారు. మంగళవారం పిడూరులోని వివిధ రకాల ఉద్యాన పంటలను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా స్ధానిక విలేకరులతో మాట్లాడుతూ అగ్రికల్చర్ హార్టీకల్చర్ అదేవిధంగా డ్రిప్ ఇరిగేషన్ మూడు శాఖల సమన్యాయంతో రైతుభరోసా కేంద్రాల ద్వారా రైతులకు కావలసిన ఎరువులు విత్తనాలు అందేవిధంగా ఏర్పాట్లు చేశామన్నారు. రైతులకు అవగాహన కల్పించి వారికి కావలసిన పరికరాలు యంత్రాలు రైతుభరోసా కేంద్రాల ద్వారా అందచేయడం. అలాగే బ్యాంకులో రుణసదుపాయం కల్పించడం జరుగుతుందన్నారు. వ్యవసాయం ఉద్యాన పంటలు లాభసాటిగా సాగేందుకు కృషిచేస్తున్నామన్నారు. గౌరవ ముఖ్యమంత్రి గిట్టుబాటు ధర కల్పించడం జరిఢిందని రైతులందరూ దళారులను నమ్మి మోసపోకుండా ధాన్యం కొనుగోలు కేంద్రాల్లోనే విక్రయాలు జరపుకోవాలన్నారు. ప్రతిధాన్యం గింజ ప్రభుతమే కొనుగోలు చేస్తుందన్నారు. అకాల వర్షాలతో రైతులు నష్టపోకుండా వచ్చే సంవత్సరం నుండి 175 గోడౌన్లు మంజూరు చేయించేవిదంగా ప్రణాళికలు సిధ్ధంచేస్తున్నామన్నారు. రాబోయే రెండుమూడు సంవత్సరాలలో గ్రామాల్లోనే రైతులకు అన్ని వసతులు పూర్తి స్ధాయిలో అందేవిధంగా చర్యలు తీసుకుంటున్నామన్నారు. జిల్లాలో ఖాళీగావున్నా అగ్రికల్చర్ అసిస్టెంట్ల పోస్టులు భర్తీచేసి వీరందరు పొలాల్లో నేరుగా వెళ్లి రైతులకు సలహాలు సూచనలు ఇచ్చేవిధంగా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామన్నారు. జిల్లా వ్యాప్తంగా 665 రైతుభరోసా కేంద్రాలు పూర్తిస్థాయిలో వినియెగంలో వున్నాయన్నారు.జిల్లాలోని నీరు వుండడంతో సమృద్ధిగా సాగు తాగునీరుకు ఎలాంటి ఇబ్బందులు లేవని పేర్కొన్నారు. అన్ని మునిసిపాలిటీలకు తాగునీరు అందిస్తున్నామని తెలిపారు. ముఖ్యంగా రెవెన్యూ సమస్యలు కొరకు రీ సర్వేను జనవరి 1నుండి ప్రారంభిస్తున్నామని దీంతో చుక్కలు భూములు సిజెఎఫ్ ఎస్ 22 ఎ వంటి సమస్యలు లేకుండా పోతాయన్నారు. మార్కటింగుకు. రైతులకు ఎటువంటి సమస్య లేకుండా చేసేందుకు తమవంతు కృషిచేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో ఏపిఎం పి.డి సుభాని హార్టీకల్చర్ పి.డి ప్రవీణ్. గోపిచంద్. ఆనంద్ రైతు సూర్యప్రకాష్ ఎంటానిక్ కంపెనీ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

మనుబోలు (పున్నమి విలేఖరి) 13 ,అక్టోబర్ : నెల్లూరు జిల్లాలో 57వేల హెక్టార్లలో ఉద్యాన పంటల సాగు జరుగుతుందని లక్ష హెక్టార్లలో చేర్చడమే లక్ష్యమని జిల్లా కలెక్టర్ చక్రధర్ పేర్కొన్నారు. మంగళవారం పిడూరులోని వివిధ రకాల ఉద్యాన పంటలను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా స్ధానిక విలేకరులతో మాట్లాడుతూ అగ్రికల్చర్ హార్టీకల్చర్ అదేవిధంగా డ్రిప్ ఇరిగేషన్ మూడు శాఖల సమన్యాయంతో రైతుభరోసా కేంద్రాల ద్వారా రైతులకు కావలసిన ఎరువులు విత్తనాలు అందేవిధంగా ఏర్పాట్లు చేశామన్నారు. రైతులకు అవగాహన కల్పించి వారికి కావలసిన పరికరాలు యంత్రాలు రైతుభరోసా కేంద్రాల ద్వారా అందచేయడం. అలాగే బ్యాంకులో రుణసదుపాయం కల్పించడం జరుగుతుందన్నారు. వ్యవసాయం ఉద్యాన పంటలు లాభసాటిగా సాగేందుకు కృషిచేస్తున్నామన్నారు. గౌరవ ముఖ్యమంత్రి గిట్టుబాటు ధర కల్పించడం జరిఢిందని రైతులందరూ దళారులను నమ్మి మోసపోకుండా ధాన్యం కొనుగోలు కేంద్రాల్లోనే విక్రయాలు జరపుకోవాలన్నారు. ప్రతిధాన్యం గింజ ప్రభుతమే కొనుగోలు చేస్తుందన్నారు. అకాల వర్షాలతో రైతులు నష్టపోకుండా వచ్చే సంవత్సరం నుండి 175 గోడౌన్లు మంజూరు చేయించేవిదంగా ప్రణాళికలు సిధ్ధంచేస్తున్నామన్నారు. రాబోయే రెండుమూడు సంవత్సరాలలో గ్రామాల్లోనే రైతులకు అన్ని వసతులు పూర్తి స్ధాయిలో అందేవిధంగా చర్యలు తీసుకుంటున్నామన్నారు. జిల్లాలో ఖాళీగావున్నా అగ్రికల్చర్ అసిస్టెంట్ల పోస్టులు భర్తీచేసి వీరందరు పొలాల్లో నేరుగా వెళ్లి రైతులకు సలహాలు సూచనలు ఇచ్చేవిధంగా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామన్నారు. జిల్లా వ్యాప్తంగా 665 రైతుభరోసా కేంద్రాలు పూర్తిస్థాయిలో వినియెగంలో వున్నాయన్నారు.జిల్లాలోని నీరు వుండడంతో సమృద్ధిగా సాగు తాగునీరుకు ఎలాంటి ఇబ్బందులు లేవని పేర్కొన్నారు. అన్ని మునిసిపాలిటీలకు తాగునీరు అందిస్తున్నామని తెలిపారు. ముఖ్యంగా రెవెన్యూ సమస్యలు కొరకు రీ సర్వేను జనవరి 1నుండి ప్రారంభిస్తున్నామని దీంతో చుక్కలు భూములు సిజెఎఫ్ ఎస్ 22 ఎ వంటి సమస్యలు లేకుండా పోతాయన్నారు. మార్కటింగుకు. రైతులకు ఎటువంటి సమస్య లేకుండా చేసేందుకు తమవంతు కృషిచేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో ఏపిఎం పి.డి సుభాని హార్టీకల్చర్ పి.డి ప్రవీణ్. గోపిచంద్. ఆనంద్ రైతు సూర్యప్రకాష్ ఎంటానిక్ కంపెనీ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.