పెళ్లకూరు మండలంలోని రోశనూరు దళితవాడలో నూతనంగా నిర్మించిన శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో బుధవారం అంగ,రంగ వైభవంగా కుంబాభిషేకం మహోత్సవం నిర్వహించారు. కుంభాభిషేక మహోత్సవంలో పాల్గొన్న సూళ్లూరుపేట ఎమ్మెల్యే డాక్టర్ నెలవల విజయ శ్రీ, పార్థసారథి దంపతులు స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.అనంతరం వేద పండితులు వారిని ఆశీర్వదించి తీర్థప్రసాదాలు అందజేశారు.ఈ సందర్భంగా రోసనూరు టిడిపి నేత దొమ్మరాజు సత్యంరాజు ఎమ్మెల్యే డాక్టర్ నెలవల విజయ శ్రీ,పార్థసారథి దంపతులకు శాలువాలు కప్పి,సన్మానించి,పట్టు వస్త్రాలు అందజేశారు.ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు పాల్గొన్నారు.

రోసనూరు లో వైభవంగా శ్రీ వెంకటేశ్వర స్వామి కుంభాభిషేకం
పెళ్లకూరు మండలంలోని రోశనూరు దళితవాడలో నూతనంగా నిర్మించిన శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో బుధవారం అంగ,రంగ వైభవంగా కుంబాభిషేకం మహోత్సవం నిర్వహించారు. కుంభాభిషేక మహోత్సవంలో పాల్గొన్న సూళ్లూరుపేట ఎమ్మెల్యే డాక్టర్ నెలవల విజయ శ్రీ, పార్థసారథి దంపతులు స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.అనంతరం వేద పండితులు వారిని ఆశీర్వదించి తీర్థప్రసాదాలు అందజేశారు.ఈ సందర్భంగా రోసనూరు టిడిపి నేత దొమ్మరాజు సత్యంరాజు ఎమ్మెల్యే డాక్టర్ నెలవల విజయ శ్రీ,పార్థసారథి దంపతులకు శాలువాలు కప్పి,సన్మానించి,పట్టు వస్త్రాలు అందజేశారు.ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు పాల్గొన్నారు.

