ఖమ్మం ఆగష్టు
(పున్నమి ప్రతినిధి )
ఖమ్మం బైపాస్ నుండి కామంచికల్ వెళ్లే ప్రధాన రహదారి సమస్యను పరిష్కరించాలని బీజేపీ, బిఆర్ఎస్,టీడీపీ, రామన్నపేట, దానవాయిగూడెం ఆటో కార్మికులతో కలిసి పెద్ద ఎత్తున రాస్తారోకో చేశారు. ఈ రాస్తారోకో ని ఉద్దేశించి
బీజేపీ ఖమ్మం జిల్లా యువ నాయకులు వల్లాల రమేష్ యాదవ్ మాట్లాడుతూ
ఈ రోడ్డు నుండి సుమారు 15 గ్రామాల ప్రజలు ఖమ్మం నగరానికి రాకపోకలు చేస్తూ ఉంటారు అని అధ్వానంగా గుంటలమయంగా ఉన్న ఈ రోడ్డు వల్ల ఆ ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అని అంతే కాకుండా ఆటో కార్మికులు కూడా పెద్ద ఎత్తున సమస్యలు ఎదుర్కొంటున్నారు అని ఖమ్మం జిల్లా నుండి ముగ్గురు మంత్రులు ఉన్న
ఈ చిన్న రోడ్డు సమస్యను ఎందుకు పరిష్కరించలేకపోతున్నారు అని రమేష్ ప్రభుత్వం ని ప్రశ్నించారు.ఈ రోడ్డు సమస్యను పరిష్కరించే వరకు పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని వాళ్ళలా రమేష్ హెచ్చరించారు.
ఈ కార్యక్రమం లో గజ్జల శ్రీనివాస్, కందుల శ్రీ కృష్ణ ఇతర బిజెపి, బి ఆర్ ఎస్, తెలుగు దేశం పార్టీ నాయకులు పాల్గొన్నారు


