రైల్వే కోడూరు మండలం గుంజన ఏరు వద్ద రూ. 5 కోట్ల 70 లక్షల వ్యయంతో నిర్మించబడనున్న కోడూరు–గుర్రప్పాళెం వంతెనకు ఈ రోజు ఘనంగా భూమి పూజ జరిగింది.ఈ కార్యక్రమంలో టీడీపీ పార్టీ ఇంచార్జ్ & కడప అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ ముక్కా రూపానంద రెడ్డి గారు, యువ నాయకుడు ముక్కా సాయి వికాస్ రెడ్డి గారు పాల్గొన్నారు.సుమారు 16 గ్రామాల ప్రజలకు రాకపోకల సౌకర్యం కల్పించనున్న ఈ వంతెన స్థానికుల ఎన్నో సంవత్సరాల కల. గ్రామస్తుల దీర్ఘకాలిక పోరాటం, రూపానంద రెడ్డి గారి కృషితో ఇది సాకారం అవుతోంది.వంతెన పూర్తయిన తర్వాత కోడూరు అభివృద్ధికి ఇది మైలురాయి అవుతుందని స్థానికులు ఆనందం వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో బత్యాల చెంగల్ రాయుడు గారు, అధికారులు, కూటమి నాయకులు, గ్రామ పెద్దలు, యువత మరియు పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు.

రైల్వే కోడూరు నియోజకవర్గంలో 5.70 కోట్లతో కోడూరు–గుర్రప్పాళెం వంతెనకు భూమిపూజ
రైల్వే కోడూరు మండలం గుంజన ఏరు వద్ద రూ. 5 కోట్ల 70 లక్షల వ్యయంతో నిర్మించబడనున్న కోడూరు–గుర్రప్పాళెం వంతెనకు ఈ రోజు ఘనంగా భూమి పూజ జరిగింది.ఈ కార్యక్రమంలో టీడీపీ పార్టీ ఇంచార్జ్ & కడప అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ ముక్కా రూపానంద రెడ్డి గారు, యువ నాయకుడు ముక్కా సాయి వికాస్ రెడ్డి గారు పాల్గొన్నారు.సుమారు 16 గ్రామాల ప్రజలకు రాకపోకల సౌకర్యం కల్పించనున్న ఈ వంతెన స్థానికుల ఎన్నో సంవత్సరాల కల. గ్రామస్తుల దీర్ఘకాలిక పోరాటం, రూపానంద రెడ్డి గారి కృషితో ఇది సాకారం అవుతోంది.వంతెన పూర్తయిన తర్వాత కోడూరు అభివృద్ధికి ఇది మైలురాయి అవుతుందని స్థానికులు ఆనందం వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో బత్యాల చెంగల్ రాయుడు గారు, అధికారులు, కూటమి నాయకులు, గ్రామ పెద్దలు, యువత మరియు పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు.

