Monday, 8 December 2025
  • Home  
  • రైల్వే కోడూరులో డ్రగ్స్ అబ్యూస్ ప్రతిజ్ఞ & హర్ ఘర్ తిరంగా కార్యక్రమం
- అన్నమయ్య

రైల్వే కోడూరులో డ్రగ్స్ అబ్యూస్ ప్రతిజ్ఞ & హర్ ఘర్ తిరంగా కార్యక్రమం

రైల్వే కోడూరు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో, కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ యం. భాస్కర్ రెడ్డి గారి అధ్యక్షతన విద్యార్థులు డ్రగ్స్ అబ్యూస్ పై ప్రతిజ్ఞ చేశారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ గారు మాట్లాడుతూ యువత మాదకద్రవ్యాల వినియోగం నుండి దూరంగా ఉండాలని, అవి శారీరక, మానసిక ఆరోగ్యంపై కలిగించే దుష్ప్రభావాలను వివరించారు.తర్వాత, హర్ ఘర్ తిరంగా కార్యక్రమాన్ని ప్రిన్సిపాల్ గారి చేతుల మీదుగా ప్రారంభించారు. దేశ స్వాతంత్ర్యం కోసం ప్రాణత్యాగం చేసిన మహనీయుల త్యాగాలను స్మరించుకుంటూ, ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగరేయాలని పిలుపునిచ్చారు. జాతీయ జెండా ప్రాధాన్యతపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో భాగంగా, కళాశాల విద్యార్థులు, అధ్యాపకులు అయ్యవారిపల్లె గ్రామంలోని ప్రతి ఇంటికి వెళ్లి జాతీయ జెండా ప్రాధాన్యతను వివరించి, జెండాలు కట్టారు.ఈ కార్యక్రమంలో కళాశాల వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ జి. రమేష్, స్కిల్ హబ్ కోఆర్డినేటర్ డాక్టర్ కె. రమేష్, ఐక్యూ ఏసీ కోఆర్డినేటర్ శ్రీ జి. దయానందం, డిఎఫ్‌ఏపీ కోఆర్డినేటర్ శ్రీ డి. వెంకటేశ్వర్లు, ఎన్‌.యస్‌.ఎస్‌. కోఆర్డినేటర్ శ్రీ దాసరి మోషే, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.

రైల్వే కోడూరు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో, కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ యం. భాస్కర్ రెడ్డి గారి అధ్యక్షతన విద్యార్థులు డ్రగ్స్ అబ్యూస్ పై ప్రతిజ్ఞ చేశారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ గారు మాట్లాడుతూ యువత మాదకద్రవ్యాల వినియోగం నుండి దూరంగా ఉండాలని, అవి శారీరక, మానసిక ఆరోగ్యంపై కలిగించే దుష్ప్రభావాలను వివరించారు.తర్వాత, హర్ ఘర్ తిరంగా కార్యక్రమాన్ని ప్రిన్సిపాల్ గారి చేతుల మీదుగా ప్రారంభించారు. దేశ స్వాతంత్ర్యం కోసం ప్రాణత్యాగం చేసిన మహనీయుల త్యాగాలను స్మరించుకుంటూ, ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగరేయాలని పిలుపునిచ్చారు. జాతీయ జెండా ప్రాధాన్యతపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో భాగంగా, కళాశాల విద్యార్థులు, అధ్యాపకులు అయ్యవారిపల్లె గ్రామంలోని ప్రతి ఇంటికి వెళ్లి జాతీయ జెండా ప్రాధాన్యతను వివరించి, జెండాలు కట్టారు.ఈ కార్యక్రమంలో కళాశాల వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ జి. రమేష్, స్కిల్ హబ్ కోఆర్డినేటర్ డాక్టర్ కె. రమేష్, ఐక్యూ ఏసీ కోఆర్డినేటర్ శ్రీ జి. దయానందం, డిఎఫ్‌ఏపీ కోఆర్డినేటర్ శ్రీ డి. వెంకటేశ్వర్లు, ఎన్‌.యస్‌.ఎస్‌. కోఆర్డినేటర్ శ్రీ దాసరి మోషే, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.