1404 జీవాలకు మందులు……
కామారెడ్డి, 29డిసెంబర్, పున్నమి ప్రతినిధి :
కామారెడ్డి జిల్లా, రామారెడ్డి మండలం రెడ్డిపేట్ గొర్రెల పెంపకం దారులు ఉచిత నట్టల నివారణ మందుల శిబిరాలను సద్వి నియోగం చేసుకోవా లని మండల పశువైద్యాధికారీ పిలుపునిచ్చారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వం నిర్వహిస్తున్న ఈ శిబిరాలు రైతులకు గొప్ప ఆశీస్సుగా మారాయని స్పష్టం చేశారు.ఈ సందర్భంగా మండల పశు వైద్యాధికారీ, సర్పంచ్ చేతుల మీదుగా రెడ్డిపేట గ్రామంలో ఉచిత నట్టల నివారణ శిబిరాన్ని ప్రారం భించారు.ఈ కార్యక్రమంలో స్థానిక వెటర్నరీ ఆఫీసర్ శ్రీనివాస్ రావు, నారాయణ జేవీఓ, రమేష్ వీఏ , సిబ్బంది ఆంజనేయులు, బలమని, గోపాల మిత్ర హారిక, స్వామి, గొర్రెల పెంపకం దారులు రాములు, రాజయ్య, ఎల్లయ్య తదితరులు పాల్గొన్నారు.


