డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం లో ఆర్టీసీ బస్టాండ్ లో ఆక్రమణులు తొలగించాలని తక్షణమే ప్రయాణికులకు బస్టాండ్ ను అందుబాటులోకి తీసుకురావాలని, రిలే నిరాహార దీక్ష చేస్తున్న మాల మహానాడు రాష్ట్ర కార్యదర్శి చీకిరిమిల్లి రవికుమార్ కు మద్దతుగా వామపక్షాలు, విద్యార్థి సంఘాలు ,యువజన సంఘాలు మహిళా సంఘాలు ,మాల మహానాడు ప్రజా సంఘాలు ఈనెల 21న మంగళవారం రౌండ్ టేబుల్ సమావేశాన్ని ఏర్పాటు చేశాయి. స్థానిక సమైక్యాంధ్ర నిరాహార దీక్ష శిబిరంలో ఉదయం 10 గంటలకు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది బ⁷స్టాండ్ ను ప్రజలకు అందుబాటులోనికి తీసుకురావాలని ,లీజిదారుడు యొక్క లీజును రద్దుచేసి రెండున్నర ఎకరాల స్థలాన్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని ,బస్టాండ్ స్థలంలోని ఫంక్షన్ హాలును ప్రభుత్వం స్వాధీనం చేసుకునే నిర్వహించాలని బస్సు స్టాండ్ లోకి బస్సులు రాకపోకలకు మార్గం సుగమం చేయాలని ,బస్టాండ్ లోని కౌంటర్ ను ఏర్పాటు చేసి సిబ్బంది నియమించాలని బస్టాండ్ లో ఉన్న మరుగుదొడ్లు శుభ్రం చేసి సరైన ఏర్పాట్లు చేయాలని అనే డిమాండ్లతో రేపు సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశాన్ని విజయవంతం చేయాలని ప్రజాసంఘాలు ,వామపక్ష సంఘాలు పిలుపునిచ్చాయి. ఈ రిలే నిరాహార దీక్ష శిబిరాన్ని ఈరోజు పిడిఎస్ నాయకులు ,రేవు తిరుపతిరావు, మాల మహానాడు నాయకులు మెండి కృష్ణబాబు ,నీలం చిన్నబాబు, గిడ్డి ప్రసాద్ తదితరులు సంఘీభావం ప్రకటించారు

రిలే నిరాహార దీక్షకు మద్దతుగా ప్రజాసంఘాలు ఉద్యమం ఉదృతం
డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం లో ఆర్టీసీ బస్టాండ్ లో ఆక్రమణులు తొలగించాలని తక్షణమే ప్రయాణికులకు బస్టాండ్ ను అందుబాటులోకి తీసుకురావాలని, రిలే నిరాహార దీక్ష చేస్తున్న మాల మహానాడు రాష్ట్ర కార్యదర్శి చీకిరిమిల్లి రవికుమార్ కు మద్దతుగా వామపక్షాలు, విద్యార్థి సంఘాలు ,యువజన సంఘాలు మహిళా సంఘాలు ,మాల మహానాడు ప్రజా సంఘాలు ఈనెల 21న మంగళవారం రౌండ్ టేబుల్ సమావేశాన్ని ఏర్పాటు చేశాయి. స్థానిక సమైక్యాంధ్ర నిరాహార దీక్ష శిబిరంలో ఉదయం 10 గంటలకు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది బ⁷స్టాండ్ ను ప్రజలకు అందుబాటులోనికి తీసుకురావాలని ,లీజిదారుడు యొక్క లీజును రద్దుచేసి రెండున్నర ఎకరాల స్థలాన్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని ,బస్టాండ్ స్థలంలోని ఫంక్షన్ హాలును ప్రభుత్వం స్వాధీనం చేసుకునే నిర్వహించాలని బస్సు స్టాండ్ లోకి బస్సులు రాకపోకలకు మార్గం సుగమం చేయాలని ,బస్టాండ్ లోని కౌంటర్ ను ఏర్పాటు చేసి సిబ్బంది నియమించాలని బస్టాండ్ లో ఉన్న మరుగుదొడ్లు శుభ్రం చేసి సరైన ఏర్పాట్లు చేయాలని అనే డిమాండ్లతో రేపు సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశాన్ని విజయవంతం చేయాలని ప్రజాసంఘాలు ,వామపక్ష సంఘాలు పిలుపునిచ్చాయి. ఈ రిలే నిరాహార దీక్ష శిబిరాన్ని ఈరోజు పిడిఎస్ నాయకులు ,రేవు తిరుపతిరావు, మాల మహానాడు నాయకులు మెండి కృష్ణబాబు ,నీలం చిన్నబాబు, గిడ్డి ప్రసాద్ తదితరులు సంఘీభావం ప్రకటించారు

