Thursday, 5 February 2026
  • Home  
  • రాయలసీమ ప్రాంత పాలిట జగన్ రెడ్డి ఒక ‘శని’.. సాగునీటి రంగానికి గత వైసిపి పాలన ఒక పీడకల: రాము యాదవ్ ఘాటు విమర్శలు
- అన్నమయ్య

రాయలసీమ ప్రాంత పాలిట జగన్ రెడ్డి ఒక ‘శని’.. సాగునీటి రంగానికి గత వైసిపి పాలన ఒక పీడకల: రాము యాదవ్ ఘాటు విమర్శలు

రాయలసీమ అభివృద్ధిపై కపట ప్రేమ నటిస్తున్న వైసిపి నాయకులకు, ఆ ప్రాంత ప్రాజెక్టుల గురించి మాట్లాడే అర్హతే లేదని మాజీ తెలుగు యువత అధ్యక్షులు రాము యాదవ్ ధ్వజమెత్తారు. మంగళవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేస్తూ, గత ఐదేళ్ల జగన్ పాలనలో సీమ ప్రాజెక్టులు ఎలా నాశనమయ్యాయో వివరించారు. ​సీమ ద్రోహి జగన్ రెడ్డి.. 102 ప్రాజెక్టుల రద్దు నిజం కాదా? ​”జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి రాగానే రాయలసీమ ప్రాజెక్టులకు మరణశాసనం రాశారు. రాష్ట్రవ్యాప్తంగా రద్దు చేసిన 198 సాగునీటి పనుల్లో, ఒక్క సీమ ప్రాంతానివే 102 ప్రాజెక్టులు ఉండటం అన్యాయం కాదా? అభివృద్ధికి ఊపిరి లాంటి డ్రిప్ ఇరిగేషన్‌ను రద్దు చేసి రైతుల పొట్ట కొట్టింది నువ్వు కాదా జగన్ రెడ్డి?” అని రాము యాదవ్ ప్రశ్నించారు. ​మేనేజ్మెంట్ లోపం – అన్నమయ్య ప్రాజెక్టు బలి ​వైసిపి నేతల అజ్ఞానం వల్ల అన్నమయ్య ప్రాజెక్టు కుప్పకూలిందని, అది ముమ్మాటికీ ప్రభుత్వ హత్యేనని ఆయన ఆరోపించారు. అనుమతులు లేకుండా హడావిడి చేసి, రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని కోర్టు వివాదాల్లోకి నెట్టి నిలిపివేసింది వైసిపి ప్రభుత్వమేనని మండిపడ్డారు. వైసిపి నేతలు ప్రాజెక్టుల గురించి మాట్లాడటం అంటే ‘దెయ్యాలు వేదాలు వల్లించినట్లే’ ఉందని ఎద్దేవా చేశారు. ​చరిత్ర సాక్షిగా.. చంద్రబాబే సీమ భాగ్యవిధాత ​రాయలసీమ రాతను మార్చింది తెలుగుదేశం పార్టీయేనని ఆయన గుర్తు చేశారు: ​ఎన్టీఆర్ విజన్: హంద్రీ-నీవా, గాలేరు-నగిరి, తెలుగు గంగ, కేసీ కెనాల్ వంటి బృహత్తర ప్రాజెక్టులను ప్రారంభించిన ఘనత స్వర్గీయ ఎన్టీఆర్ ది. ​బాబు మార్క్ అభివృద్ధి: 2014-2019 మధ్య కాలంలో కేవలం రాయలసీమ ప్రాజెక్టుల కోసమే చంద్రబాబు నాయుడు గారు ₹12,411 కోట్లు కేటాయించారు. ​నీటి సాధన: కృష్ణా జలాలను 750 కి.మీ దూరం తీసుకువచ్చి, కుప్పం చేరేలోపే 19 నియోజకవర్గాల్లోని 423 చెరువులను నింపిన ఘనత కూటమి ప్రభుత్వానిదే. ​పులివెందులకు నీరు: చివరకు జగన్ నియోజకవర్గం పులివెందులకు కూడా సాగునీరు అందించిన నాయకుడు మన ముఖ్యమంత్రి చంద్రబాబు అని స్పష్టం చేశారు. ​హెచ్చరిక ​తప్పుడు ప్రచారాలతో ప్రజలను మభ్యపెట్టాలని చూస్తే రాయలసీమ ప్రజలు బుద్ధి చెప్తారని రాము యాదవ్ హెచ్చరించారు. అభివృద్ధి అంటే విధ్వంసం కాదు, ప్రాజెక్టులు పూర్తి చేయడమని ఇప్పటికైనా తెలుసుకోవాలని హితవు పలికారు. ​

రాయలసీమ అభివృద్ధిపై కపట ప్రేమ నటిస్తున్న వైసిపి నాయకులకు, ఆ ప్రాంత ప్రాజెక్టుల గురించి మాట్లాడే అర్హతే లేదని మాజీ తెలుగు యువత అధ్యక్షులు రాము యాదవ్ ధ్వజమెత్తారు. మంగళవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేస్తూ, గత ఐదేళ్ల జగన్ పాలనలో సీమ ప్రాజెక్టులు ఎలా నాశనమయ్యాయో వివరించారు.
​సీమ ద్రోహి జగన్ రెడ్డి.. 102 ప్రాజెక్టుల రద్దు నిజం కాదా?
​”జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి రాగానే రాయలసీమ ప్రాజెక్టులకు మరణశాసనం రాశారు. రాష్ట్రవ్యాప్తంగా రద్దు చేసిన 198 సాగునీటి పనుల్లో, ఒక్క సీమ ప్రాంతానివే 102 ప్రాజెక్టులు ఉండటం అన్యాయం కాదా? అభివృద్ధికి ఊపిరి లాంటి డ్రిప్ ఇరిగేషన్‌ను రద్దు చేసి రైతుల పొట్ట కొట్టింది నువ్వు కాదా జగన్ రెడ్డి?” అని రాము యాదవ్ ప్రశ్నించారు.
​మేనేజ్మెంట్ లోపం – అన్నమయ్య ప్రాజెక్టు బలి
​వైసిపి నేతల అజ్ఞానం వల్ల అన్నమయ్య ప్రాజెక్టు కుప్పకూలిందని, అది ముమ్మాటికీ ప్రభుత్వ హత్యేనని ఆయన ఆరోపించారు. అనుమతులు లేకుండా హడావిడి చేసి, రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని కోర్టు వివాదాల్లోకి నెట్టి నిలిపివేసింది వైసిపి ప్రభుత్వమేనని మండిపడ్డారు. వైసిపి నేతలు ప్రాజెక్టుల గురించి మాట్లాడటం అంటే ‘దెయ్యాలు వేదాలు వల్లించినట్లే’ ఉందని ఎద్దేవా చేశారు.
​చరిత్ర సాక్షిగా.. చంద్రబాబే సీమ భాగ్యవిధాత
​రాయలసీమ రాతను మార్చింది తెలుగుదేశం పార్టీయేనని ఆయన గుర్తు చేశారు:
​ఎన్టీఆర్ విజన్: హంద్రీ-నీవా, గాలేరు-నగిరి, తెలుగు గంగ, కేసీ కెనాల్ వంటి బృహత్తర ప్రాజెక్టులను ప్రారంభించిన ఘనత స్వర్గీయ ఎన్టీఆర్ ది.
​బాబు మార్క్ అభివృద్ధి: 2014-2019 మధ్య కాలంలో కేవలం రాయలసీమ ప్రాజెక్టుల కోసమే చంద్రబాబు నాయుడు గారు ₹12,411 కోట్లు కేటాయించారు.
​నీటి సాధన: కృష్ణా జలాలను 750 కి.మీ దూరం తీసుకువచ్చి, కుప్పం చేరేలోపే 19 నియోజకవర్గాల్లోని 423 చెరువులను నింపిన ఘనత కూటమి ప్రభుత్వానిదే.
​పులివెందులకు నీరు: చివరకు జగన్ నియోజకవర్గం పులివెందులకు కూడా సాగునీరు అందించిన నాయకుడు మన ముఖ్యమంత్రి చంద్రబాబు అని స్పష్టం చేశారు.
​హెచ్చరిక
​తప్పుడు ప్రచారాలతో ప్రజలను మభ్యపెట్టాలని చూస్తే రాయలసీమ ప్రజలు బుద్ధి చెప్తారని రాము యాదవ్ హెచ్చరించారు. అభివృద్ధి అంటే విధ్వంసం కాదు, ప్రాజెక్టులు పూర్తి చేయడమని ఇప్పటికైనా తెలుసుకోవాలని హితవు పలికారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.