రాబోయే రెండు రోజులు రాయలసీమ జిల్లాల్లో వర్షాలు విస్తృతంగా, భారీగా కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. చిత్తూరు, అన్నమయ్య, వైఎస్ఆర్ కడప, తిరుపతి (పశ్చిమ), అనంతపురం (తూర్పు), సత్యసాయి (తూర్పు) జిల్లాల్లో రాత్రి, అర్థరాత్రి వేళల్లో వడగళ్లతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది. కొన్నిసార్లు ఈ వర్షాలు తెల్లవారుజాము వరకు కొనసాగవచ్చని అధికారులు తెలిపారు. అదనంగా, కర్నూలు, నంద్యాల సహా రాయలసీమ ఇతర ప్రాంతాల్లో కూడా అక్కడక్కడా భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. రాష్ట్రంలోని మిగతా ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొన్నారు. వర్షాల సమయంలో పిడుగులు పడే ప్రమాదం ఉన్నందున రైతులు, పశువులను రక్షించుకోవడంతో పాటు ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. అలాగే పిడుగులు, వర్షాల సమయంలో ఇంట్లో ఎలక్ట్రిక్ పరికరాలు కూడా దెబ్బతినే అవకాశం ఉందని విద్యుత్ శాఖ హెచ్చరించింది. ఇంట్లో ఉండే వారు తగిన జాగ్రత్తలు పాటించాలని విజ్ఞప్తి చేసింది.

రాయలసీమ జిల్లాలకు తీవ్ర పిడుగుల హెచ్చరిక
రాబోయే రెండు రోజులు రాయలసీమ జిల్లాల్లో వర్షాలు విస్తృతంగా, భారీగా కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. చిత్తూరు, అన్నమయ్య, వైఎస్ఆర్ కడప, తిరుపతి (పశ్చిమ), అనంతపురం (తూర్పు), సత్యసాయి (తూర్పు) జిల్లాల్లో రాత్రి, అర్థరాత్రి వేళల్లో వడగళ్లతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది. కొన్నిసార్లు ఈ వర్షాలు తెల్లవారుజాము వరకు కొనసాగవచ్చని అధికారులు తెలిపారు. అదనంగా, కర్నూలు, నంద్యాల సహా రాయలసీమ ఇతర ప్రాంతాల్లో కూడా అక్కడక్కడా భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. రాష్ట్రంలోని మిగతా ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొన్నారు. వర్షాల సమయంలో పిడుగులు పడే ప్రమాదం ఉన్నందున రైతులు, పశువులను రక్షించుకోవడంతో పాటు ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. అలాగే పిడుగులు, వర్షాల సమయంలో ఇంట్లో ఎలక్ట్రిక్ పరికరాలు కూడా దెబ్బతినే అవకాశం ఉందని విద్యుత్ శాఖ హెచ్చరించింది. ఇంట్లో ఉండే వారు తగిన జాగ్రత్తలు పాటించాలని విజ్ఞప్తి చేసింది.

