పేరు బద్రి. పీర్ కుమార్ విద్యార్హతలు ఎం.ఏ., పిహెచ్డి. వేదాయపాలెం నెల్లూరులో నివాసం ఉంటూ గత 25 సంవత్సరాలుగా అధ్యాపకుడిగా పనిచేస్తూనే వివిధ నాటికలు (ధృతరాష్ట్ర కౌగిలి, అంకురం, కడదాకా, మాతృ వందనం, బదనిక, నాన్న బంగారం, మొదలైనవి), జెమిని, మాటీవీ, సప్తగిరి ఛానల్ (దూరదర్శన్), ఈటీవీ2 లలో సీరియల్స్, సినిమాలలో (తధాస్తు, నవోదయం, ఆకాంక్ష, కాశినాయన చరిత్ర, ఆశయం, వన ప్రేమికులు, పచ్చతోరణం, కరువు సీమలో కాంతిరేఖలు, ఫ్యాక్షన్ ఫ్యాక్షన్, ప్రేమఖైదీ, చెల్లి, మైండ్ గేమ్, బ్లైండ్ గర్ల్, వేట, అగ్ని, వసంతసేన, చిత్రగుప్తుడి భూలోక టూర్, అసుర సంహారం మొదలైనవి). సుమారు 10 టేలి ఫిలిమ్స్, 5 సీరియల్స్, 6 సినిమాలలో నటించి ప్రస్తుతము నటిస్తూ ఉన్నారు. వృత్తి అధ్యాపకుడు ప్రవృత్తి నటన ఈ రెండింటికి న్యాయం చేస్తూ అభ్యుదయ పాటలు నాటికలు రాస్తూ ఉంటారు. ఈమధ్య తెలుగులో జాతీయ జెండాపై రాసిన గేయం “జండా జండా భారత జెండా” చాలామందిని ఆకట్టుకుంది. ఇటీవల నాటక రంగానికి అందించిన సేవలకు గాను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నాటక రంగానికి అందించే కందుకూరి విశిష్ట పురస్కారం2025, తెలుగు వెలుగు జాతీయ స్వచ్ఛంద సేవా సంస్థ ద్వారా ఎన్టీఆర్ జాతీయ పురస్కారం పొందడం విశేషం. “ఫ్యాక్షన్ వద్దు పీస్ ముద్దు”, “మృగం మారింది”. “యజ్ఞం”, “లక్ష్యం” మొదలైన కళాశాల నాటికలు రచించి యూనివర్సిటీ స్థాయిలో ప్రశంసలు పొందారు. ఇటీవల రాసిన “వంశవృక్షం” గుంటూరులో ప్రదర్శించి ప్రేక్షకాదరణ పొందడం జరిగింది. కేవలం రచన కాకుండా మంచి మంచి క్యారెక్టర్స్ వస్తే సినిమాలలో కూడా నటిస్తూ ఉంటానని తెలియజేశారు డాక్టర్ పీర్ కుమార్.

రచయిత పరిచయం – (డాక్టర్ బద్రి. పీర్ కుమార్ రచయిత, నటులు – కందుకూరి విశిష్ఠ పురస్కార గ్రహీత.)
పేరు బద్రి. పీర్ కుమార్ విద్యార్హతలు ఎం.ఏ., పిహెచ్డి. వేదాయపాలెం నెల్లూరులో నివాసం ఉంటూ గత 25 సంవత్సరాలుగా అధ్యాపకుడిగా పనిచేస్తూనే వివిధ నాటికలు (ధృతరాష్ట్ర కౌగిలి, అంకురం, కడదాకా, మాతృ వందనం, బదనిక, నాన్న బంగారం, మొదలైనవి), జెమిని, మాటీవీ, సప్తగిరి ఛానల్ (దూరదర్శన్), ఈటీవీ2 లలో సీరియల్స్, సినిమాలలో (తధాస్తు, నవోదయం, ఆకాంక్ష, కాశినాయన చరిత్ర, ఆశయం, వన ప్రేమికులు, పచ్చతోరణం, కరువు సీమలో కాంతిరేఖలు, ఫ్యాక్షన్ ఫ్యాక్షన్, ప్రేమఖైదీ, చెల్లి, మైండ్ గేమ్, బ్లైండ్ గర్ల్, వేట, అగ్ని, వసంతసేన, చిత్రగుప్తుడి భూలోక టూర్, అసుర సంహారం మొదలైనవి). సుమారు 10 టేలి ఫిలిమ్స్, 5 సీరియల్స్, 6 సినిమాలలో నటించి ప్రస్తుతము నటిస్తూ ఉన్నారు. వృత్తి అధ్యాపకుడు ప్రవృత్తి నటన ఈ రెండింటికి న్యాయం చేస్తూ అభ్యుదయ పాటలు నాటికలు రాస్తూ ఉంటారు. ఈమధ్య తెలుగులో జాతీయ జెండాపై రాసిన గేయం “జండా జండా భారత జెండా” చాలామందిని ఆకట్టుకుంది. ఇటీవల నాటక రంగానికి అందించిన సేవలకు గాను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నాటక రంగానికి అందించే కందుకూరి విశిష్ట పురస్కారం2025, తెలుగు వెలుగు జాతీయ స్వచ్ఛంద సేవా సంస్థ ద్వారా ఎన్టీఆర్ జాతీయ పురస్కారం పొందడం విశేషం. “ఫ్యాక్షన్ వద్దు పీస్ ముద్దు”, “మృగం మారింది”. “యజ్ఞం”, “లక్ష్యం” మొదలైన కళాశాల నాటికలు రచించి యూనివర్సిటీ స్థాయిలో ప్రశంసలు పొందారు. ఇటీవల రాసిన “వంశవృక్షం” గుంటూరులో ప్రదర్శించి ప్రేక్షకాదరణ పొందడం జరిగింది. కేవలం రచన కాకుండా మంచి మంచి క్యారెక్టర్స్ వస్తే సినిమాలలో కూడా నటిస్తూ ఉంటానని తెలియజేశారు డాక్టర్ పీర్ కుమార్.

