రంజాన్ ఇఫ్తార్లో పాల్గొన్న డాక్టర్ అర్జున్ రెడ్డి గాయపడిన మతీన్ కుటుంబానికి ఆర్థిక సహాయం
రంజాన్ మాసం క్రమశిక్షణ, సహనం మరియు సేవాభావానికి నిదర్శనమని కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి గారి తనయుడు డాక్టర్ అర్జున్ రెడ్డి గారు పేర్కొన్నారు. కోవూరు నియోజకవర్గంలోని బుచ్చిరెడ్డిపాలెం మరియు కోవూరులో నిర్వహించిన ఇఫ్తార్ విందులో ఆయన పాల్గొని ముస్లిం సోదరులతో కలిసి ఉపవాసం విరమించారు.
ఈ సందర్భంగా మౌజన్లకు మరియు VPR ఫౌండేషన్ తరఫున రంజాన్ తోఫా కిట్లు అందజేశారు.
అనంతరం ఇటీవల రోడ్డు ప్రమాదంలో గాయపడిన టిడిపి నాయకుడు ఎస్.డి. మతీన్ గారి నివాసానికి వెళ్లి ఆయన ఆరోగ్య పరిస్థితిని తెలుసుకుని పరామర్శించారు. ఈ సందర్భంగా మతీన్ కుటుంబ సభ్యులకు రూ.20,000 ఆర్థిక సహాయం అందజేశారు.



