Sunday, 29 March 2026
  • Home  
  • మైదుకూరు 18వ వార్డులో బురద రోడ్లు, సమస్యల వలయం
- కడప

మైదుకూరు 18వ వార్డులో బురద రోడ్లు, సమస్యల వలయం

మైదుకూరు మున్సిపాలిటీ 18వ వార్డులోని సీతారామాంజనేయపురం ప్రజలు, ఎర్రచెరువు రైతులు తమ సమస్యలపై శుక్రవారం మునిసిపల్ కమీషనర్‌కు వినతిపత్రం సమర్పించారు. గత 20 ఏళ్లుగా ఇంటి పన్ను కడుతున్నా సీసీ రోడ్లు, వీధి లైట్లు, కుళాయిలు లేవని వాపోయారు. వీధిలో మోకాళ్ల లోతు నీళ్లు నిలవడంతో ప్రయాణం కష్టమైంది. విష సర్పాల భయంతో పాటు, కార్తీక మాసంలో జరిగే భీమేశ్వరస్వామి తెప్పోత్సవం కూడా దారి లేక నిలిచిపోయిందని తెలిపారు. సమస్యను పరిష్కరించాలని ఎమ్మెల్యే పుట్టా సుధాకర్‌ యాదవ్‌ కూడా కోరారని తెలిపారు.

మైదుకూరు మున్సిపాలిటీ 18వ వార్డులోని సీతారామాంజనేయపురం ప్రజలు, ఎర్రచెరువు రైతులు తమ సమస్యలపై శుక్రవారం మునిసిపల్ కమీషనర్‌కు వినతిపత్రం సమర్పించారు. గత 20 ఏళ్లుగా ఇంటి పన్ను కడుతున్నా సీసీ రోడ్లు, వీధి లైట్లు, కుళాయిలు లేవని వాపోయారు. వీధిలో మోకాళ్ల లోతు నీళ్లు నిలవడంతో ప్రయాణం కష్టమైంది. విష సర్పాల భయంతో పాటు, కార్తీక మాసంలో జరిగే భీమేశ్వరస్వామి తెప్పోత్సవం కూడా దారి లేక నిలిచిపోయిందని తెలిపారు. సమస్యను పరిష్కరించాలని ఎమ్మెల్యే పుట్టా సుధాకర్‌ యాదవ్‌ కూడా కోరారని తెలిపారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.