ఏర్పేడు: ముస్లిం సోదరుల చిరకాల వాంఛను నెరవేరుస్తూ శ్రీకాళహస్తి శాసనసభ్యులు బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి ఉదారత చాటుకున్నారు. ఎమ్మెల్యే ఆదేశాల మేరకు ఏర్పేడు మండల కేంద్రంలోని ముస్లిం మైనారిటీల కోసం సోమవారం ప్రత్యేకంగా స్మశాన వాటిక స్థలాన్ని కేటాయించారు. ఏర్పేడు సబ్ స్టేషన్ సమీపంలో సుమారు 10 సెంట్ల భూమిని ఈ ప్రయోజనం కోసం కేటాయించడం జరిగింది. టీడీపీ తిరుపతి పార్లమెంట్ మహిళా నాయకురాలు గాలి కృష్ణవేణి ఆధ్వర్యంలో ఈరోజు సదరు స్థలాన్ని జేసీబీలతో చదును చేయించారు. అనంతరం ఆ భూమిని ముస్లిం పెద్దలకు అధికారికంగా అప్పజెప్పారు. స్మశాన వాటిక కోసం స్థలం లేక తాము పడుతున్న ఇబ్బందులను గుర్తించి, తక్షణమే స్పందించిన ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డికి ఏర్పేడు ముస్లిం సోదరులు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాతృమూర్తి బొజ్జల బృందమ్మ గారిని స్మరించుకుంటూ, తమ సమస్యను పరిష్కరించినందుకు కృతజ్ఞతలు చాటుకున్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక ముస్లిం పెద్దలు, తెలుగుదేశం పార్టీ నాయకులు మరియు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

ముస్లిం సోదరుల దశాబ్దాల కల సాకారం- ఏర్పేడులో స్మశాన వాటికకు స్థల కేటాయింపు
ఏర్పేడు: ముస్లిం సోదరుల చిరకాల వాంఛను నెరవేరుస్తూ శ్రీకాళహస్తి శాసనసభ్యులు బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి ఉదారత చాటుకున్నారు. ఎమ్మెల్యే ఆదేశాల మేరకు ఏర్పేడు మండల కేంద్రంలోని ముస్లిం మైనారిటీల కోసం సోమవారం ప్రత్యేకంగా స్మశాన వాటిక స్థలాన్ని కేటాయించారు. ఏర్పేడు సబ్ స్టేషన్ సమీపంలో సుమారు 10 సెంట్ల భూమిని ఈ ప్రయోజనం కోసం కేటాయించడం జరిగింది. టీడీపీ తిరుపతి పార్లమెంట్ మహిళా నాయకురాలు గాలి కృష్ణవేణి ఆధ్వర్యంలో ఈరోజు సదరు స్థలాన్ని జేసీబీలతో చదును చేయించారు. అనంతరం ఆ భూమిని ముస్లిం పెద్దలకు అధికారికంగా అప్పజెప్పారు. స్మశాన వాటిక కోసం స్థలం లేక తాము పడుతున్న ఇబ్బందులను గుర్తించి, తక్షణమే స్పందించిన ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డికి ఏర్పేడు ముస్లిం సోదరులు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాతృమూర్తి బొజ్జల బృందమ్మ గారిని స్మరించుకుంటూ, తమ సమస్యను పరిష్కరించినందుకు కృతజ్ఞతలు చాటుకున్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక ముస్లిం పెద్దలు, తెలుగుదేశం పార్టీ నాయకులు మరియు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

