ముధోల్,జనవరి 24 ( తెలంగాణ పున్నమి ప్రతినిధి నిర్మల్ ):ముధోల్ మండలంలోని ఎడ్ బిడ్ తాం డ గ్రామంలో ప్రతి సంవత్సరం నిర్వ హించే సమ్మక్క -సారలమ్మ జాతరకు గద్దెలు ముస్తాబైనట్లు దేవదాయ స్థాప కులు రేణుకమ్మ సోమవారం ఒక ప్రక టనలో తెలిపారు. ఈ జాతరకు నియోజకవర్గ కేంద్రమైన ముధోల్, బా సర,తానూర్, కుంటాల, లోకేశ్వరం, కుబీర్, బైంసా, నిజామాబాద్, హైదరా బాద్ పట్టణాల నుండి కాకుండా మహా రాష్ట్ర లోని ముంబై, ధర్మబాద్ ప్రాంతా ల నుండి భారీగా సంఖ్యలో భక్తులు స మ్మక్క- సారాలమ్మలను దర్శించుకుం టారు. సమ్మక్క -సారలమ్మలు కోరిన కోరికలు తీర్చి అమ్మవారిని భక్తుల న మ్మకం. ఈనెల 28వ తేదీ నుండి 31వ తేదీ వరకు సమ్మక్క -సారలమ్మ జాతర జరుగుతుందన్నారు. సమ్మక్క -సారలమ్మ గద్దెలను 28తేదీన బుధవారం కనక పనం శ్రీ సరళమ్మ గద్దెపైకి వచ్చును, 29 న గురువారం తేదీన శ్రీ సమ్మక్క దేవత గద్దె పైకి వచ్చును, 30న తేదీన శుక్రవారం భక్తులు సమ్మక్క- సారలమ్మ దేవతలకు ఓడి బియ్యం నిలువెత్తు బంగారం, బోనాలు మేకల తో మొక్కులను సమర్పించబడును. చివరి రోజైన 31వ తేదీన శనివారం సమ్మక్క-సారలమ్మ తిరిగి వనప్రవేశం గా వెళతారు. దీంతో ఈ జాతర నాలు గు రోజులపాటు ఎంతో వైభవంగా జరుగుతుందని దేవాదాయ ధర్మకర్త రేణుకమ్మ ధర్మకర్తలు పూజారులు జాదవ్ సతీష్, సత్యవతి నిర్వాహకులు తెలిపారు.




