**ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన జిల్లా కలెక్టర్*
*విశాఖపట్టణం డిసెంబర్ 10 పున్నమి ప్రతినిధి:- * ఈ నెల 12వ తేదీన రాష్ట్ర ముఖ్యమంత్రి జిల్లాలో పర్యటించనున్న నేపథ్యంలో సంబంధిత ఏర్పాట్లను సమన్వయకర్త పెందుర్తి వెంకటేశ్, పోలీస్ కమిషనర్ శంఖబ్రత బాగ్చీలతో కలిసి జిల్లా కలెక్టర్ ఎం.ఎన్. హరేంధిర ప్రసాద్ పరిశీలించారు. కలెక్టరట్లో సమీక్ష అనంతరం నిర్వహించిన ఏఎస్ఎల్ (అడ్వాన్స్డ్ సెక్యురిటీ లైజనింగ్)లో భాగంగా కార్యక్రమాలు జరిగే వేదికలను సందర్శించారు. ముందుగా మధురువాడ ఐటీ హిల్స్ నెం.3 వద్ద హెలిప్యాడ్ వద్ద జరుగుతున్న బారికేడ్ నిర్మాణ పనులను, లెవెలింగ్ పనులను పరిశీలించారు. అనంతరం హరిత రిసార్ట్స్ పక్కనున్న స్థలంలో కాగ్నిజెంట్ సంస్థ భూమిపూజకు సంబంధించిన వేదికను సందర్శించి అక్కడ ఏర్పాట్లను గమనించారు. కాగ్నిజెంట్ ప్రతినిధులు, అధికారులతో మాట్లాడి ఏర్పాట్లు ఎక్కడివరకు వచ్చాయో అడిగి తెలుసుకున్నారు. సమయం తక్కువ ఉన్నందున అధికారులు, నిర్వాహకులు అప్రమత్తంగా ఉండాలని, ఏర్పాట్లను త్వరితగతిన పూర్తి చేయాలని పేర్కొన్నారు. అనంతరం రుషికొండలోని ఏ-1 గ్రాండ్ కన్వెన్షన్ హాలును పరిశీలించారు. అక్కడ జరగనున్న వైజాగ్ ఎకనామిక్ రీజియన్ సమావేశం, ఇతర అంశాలపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. వారి వెంట వివిధ విభాగాల అధికారులు ఉన్నారు.
*విశాఖపట్టణం దివ్యదర్శిని న్యూస్* ఈ నెల 12వ తేదీన రాష్ట్ర ముఖ్యమంత్రి జిల్లాలో పర్యటించనున్న నేపథ్యంలో సంబంధిత ఏర్పాట్లను సమన్వయకర్త పెందుర్తి వెంకటేశ్, పోలీస్ కమిషనర్ శంఖబ్రత బాగ్చీలతో కలిసి జిల్లా కలెక్టర్ ఎం.ఎన్. హరేంధిర ప్రసాద్ పరిశీలించారు. కలెక్టరట్లో సమీక్ష అనంతరం నిర్వహించిన ఏఎస్ఎల్ (అడ్వాన్స్డ్ సెక్యురిటీ లైజనింగ్)లో భాగంగా కార్యక్రమాలు జరిగే వేదికలను సందర్శించారు. ముందుగా మధురువాడ ఐటీ హిల్స్ నెం.3 వద్ద హెలిప్యాడ్ వద్ద జరుగుతున్న బారికేడ్ నిర్మాణ పనులను, లెవెలింగ్ పనులను పరిశీలించారు. అనంతరం హరిత రిసార్ట్స్ పక్కనున్న స్థలంలో కాగ్నిజెంట్ సంస్థ భూమిపూజకు సంబంధించిన వేదికను సందర్శించి అక్కడ ఏర్పాట్లను గమనించారు. కాగ్నిజెంట్ ప్రతినిధులు, అధికారులతో మాట్లాడి ఏర్పాట్లు ఎక్కడివరకు వచ్చాయో అడిగి తెలుసుకున్నారు. సమయం తక్కువ ఉన్నందున అధికారులు, నిర్వాహకులు అప్రమత్తంగా ఉండాలని, ఏర్పాట్లను త్వరితగతిన పూర్తి చేయాలని పేర్కొన్నారు. అనంతరం రుషికొండలోని ఏ-1 గ్రాండ్ కన్వెన్షన్ హాలును పరిశీలించారు. అక్కడ జరగనున్న వైజాగ్ ఎకనామిక్ రీజియన్ సమావేశం, ఇతర అంశాలపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. వారి వెంట వివిధ విభాగాల అధికారులు ఉన్నారు.


