మహాత్మ జ్యోతిరావు పూలే విగ్రహం వద్ద బిసి సంక్షేమ సంఘం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో “నిరసన”
యాదాద్రి భువనగిరి జిల్లా పున్నమి ప్రతినిధి
కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమానికి జిల్లా అధ్యక్షులు కొత్త నరసింహస్వామి, అధ్యక్షత వహించి మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం స్థానిక సంస్థల బీసీ లకు 42 శాతం రిజర్వేషన్లను అన్ని రాజకీయ పార్టీల మద్దతుతో శాసనసభలో చట్టం చేసి, కొద్ది రోజుల్లోనే స్థానిక సంస్థల ఎన్నికలు 42% తో జరుగనున్నాయని, బీసీలంతా అనుకుంటున్న సమయంలో, కొందరు రెడ్డి సంక్షేమ సంఘం నాయకులు.. బీసీల 42 శాతం రిజర్వేషన్లను అడ్డుకోవలనే, దురుద్దేశంతో హైకోర్టు కోసం సుప్రీంకోర్టుకు వెళ్లడం, బీసీల 42 శాతం రిజర్వేషన్లను ఆపివేయాలనుకునే ఆలోచనను వెంటనే మానుకోవాలని, రాష్ట్ర గవర్నర్ దగ్గర ఉన్న రిజర్వేషన్ గారు సంతకం చేయాలని సంక్షేమ సంఘం ప్రతినిధులు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ అధ్యక్షులు సాబన్ కార్ వెంకటేష్ , ఆలేరు నియోజకవర్గం అధ్యక్షులు పేరపు రాములు, వలిగొండ మండలం అధ్యక్షులు సాయిని యాదగిరి, విశ్వకర్మ సంఘం జిల్లా అధ్యక్షులు డిఎన్ చారి, జిల్లా మనమయ సంఘం అధ్యక్షులు ఉపేంద్ర చారి, సత్యనారాయణ, రమేష్, తదితర బీసీ కుల సంఘాల నాయకులు పాల్గొన్నారు.


