ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా జనవరి (పున్నమి ప్రతినిధి)
మనుబోలు మండలంలో హౌసింగ్ డీఈ, ఏఈలపై ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్ర మోహన్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పేదల ఇళ్లు కట్టమని చెబితే ఒక్కో ఇంటికి రూ.70 వేలు తినేస్తే ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. రెండేళ్లు జీతం తీసుకోకుండా ఉంటారా అంటూ సూటిగా నిలదీశారు. వెంటనే పోలీస్ స్టేషన్కు వెళ్లి కేసు నమోదు చేయాలని సూచించారు. గతంలో ఇద్దరు ఏఈలు చేదు అనుభవాలతో వెళ్లిన విషయం గుర్తు చేశారు. డీఈకి ఫోన్ ద్వారా వార్నింగ్ ఇచ్చి, కాంట్రాక్టర్ మోహన్ రెడ్డి వద్ద నుంచి డబ్బులు రికవరీ చేయాలని ఆదేశించారు.

మనుబోలు హౌసింగ్ అధికారులపై ఎమ్మెల్యే సోమిరెడ్డి ఫైర్
ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా జనవరి (పున్నమి ప్రతినిధి) మనుబోలు మండలంలో హౌసింగ్ డీఈ, ఏఈలపై ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్ర మోహన్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పేదల ఇళ్లు కట్టమని చెబితే ఒక్కో ఇంటికి రూ.70 వేలు తినేస్తే ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. రెండేళ్లు జీతం తీసుకోకుండా ఉంటారా అంటూ సూటిగా నిలదీశారు. వెంటనే పోలీస్ స్టేషన్కు వెళ్లి కేసు నమోదు చేయాలని సూచించారు. గతంలో ఇద్దరు ఏఈలు చేదు అనుభవాలతో వెళ్లిన విషయం గుర్తు చేశారు. డీఈకి ఫోన్ ద్వారా వార్నింగ్ ఇచ్చి, కాంట్రాక్టర్ మోహన్ రెడ్డి వద్ద నుంచి డబ్బులు రికవరీ చేయాలని ఆదేశించారు.

