ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా డిసెంబర్ (పున్నమి ప్రతినిధ
మనుబోలు మండలం బద్వేల్ గ్రామంలోని జిల్లా పరిషత్ ప్రాథమిక పాఠశాలలో తల్లిదండ్రులు – ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశం సానుకూల వాతావరణంలో జరిగింది. ఈ సమావేశంలో విద్యార్థుల విద్యా ప్రగతి, హాజరు, ప్రవర్తనతో పాటు పాఠశాలలో జరుగుతున్న వివిధ కార్యక్రమాలపై చర్చించారు.
పాఠశాల ప్రధానోపాధ్యాయులు మాట్లాడుతూ, తల్లిదండ్రుల సహకారంతోనే విద్యార్థుల అభివృద్ధి సాధ్యమని పేర్కొన్నారు. ఉపాధ్యాయులు విద్యార్థుల వ్యక్తిగత పనితీరు వివరాలు తెలియజేసి, తల్లిదండ్రులతో సూచనలు పంచుకున్నారు.
తల్లిదండ్రులు పాఠశాల నిర్వహణపై సంతృప్తి వ్యక్తం చేస్తూ, పిల్లల చదువులో మరింత శ్రద్ధ తీసుకుంటామని హామీ ఇచ్చారు. పిల్లల కోసం పాఠశాలలో మరిన్ని సదుపాయాలు కల్పించాలని కూడా సూచించారుఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా గ్రామ సర్పంచ్ ఉగ్గుమూడి శశి కుమార్ రెడ్డి పాల్గొన్నారు ఆయనకు సన్మానం కార్యక్రమం చేశారు ఈ కార్యక్రమంలో ప్రధాన ఉపాధ్యాయులు చందన సురేష్ శైలజ చెంచు కృష్ణ రేఖా రాణి ప్రమీల వీరబ్రహ్మయ్య శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.


