ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా డిసెంబర్ 13 (పున్నమి ప్రతినిధి)
మనుబోలు మండలంలోని కనుపూరు కాలువకు సంబంధించిన గేట్ వాల్స్, కాలువ నిర్మాణ పనులను సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన గత వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు.
గత ప్రభుత్వ హయాంలో పనులు సక్రమంగా చేయకుండానే కోట్ల రూపాయల బిల్లులు దండుకున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. రైతులకు ఉపయోగపడాల్సిన సాగునీటి పనులు నిర్లక్ష్యానికి గురయ్యాయని, నాణ్యత లేని పనుల వల్ల ప్రజాధనం వృథా అయిందని పేర్కొన్నారు పనులు చేయకుండా బిల్లులు ఎవరైతే దండుకున్నారో వారి మీద కఠిన చర్యలు తీసుకుంటామని సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆరోపించారు.
ఈ కార్యక్రమంలో మనుబోలు, మడమనూరు మండలాల తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. భవిష్యత్తులో కాలువ పనులను సమగ్రంగా పూర్తి చేసి రైతులకు న్యాయం చేస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చార.


