ఖమ్మం ఏప్రిల్
(పువ్వాడ నాగేంద్ర కుమార్
పున్నమి జిల్లా ఇంచార్జి )
మనసున్న మా రాజు గల్లా సత్య నారాయణ యొక్క సేవా దృక్పథం
మరో సారి వెలుగుచూసింది.
ఖమ్మం జిల్లా సత్తుపల్లి నియోజకవర్గ. పరిధిలో గల
వేంసూర్ మండలానికి చెందిన వినయ్కు దగ్గరి బంధువు ఒక్కసారిగా ఆపస్మారక స్థితి లోకి వెళ్లడంతో కుటుంబ సభ్యులు ఖమ్మం స్తంబాద్రి హాస్పిటల్కు తరలించారు. సాధారణ కుటుంబం… ఆర్థిక పరిస్థితి కూడా అంతగా లేనందున వారికి చికిత్స ఖర్చులు పెద్ద భారమయ్యే పరిస్థితి వచ్చింది.
ఈ విషయం మొత్తం చరవాణి ద్వారా
సత్తుపల్లి నియోజకవర్గానికి చెందిన బీజేపీ ఖమ్మం జిల్లా ఉపాధ్యక్షులు వీరం రాజు
బీజేపీ ఖమ్మం జిల్లా మాజీ అధ్యక్షులు, తెలంగాణ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గల్లా సత్య నారాయణ కి తెలియజేశారు.
గల్లా సత్య నారాయణ సమాచారం అందుకున్న వెంటనే
నేరుగా స్థంభాద్రి హాస్పిటల్కు వెళ్లి ఆ వ్యక్తి యొక్క ఆరోగ్యం గురించి తెలుసుకున్నారు.
కుటుంబ సభ్యుల బాధ ని విని వారికి ధైర్యం చెప్పారు.
హాస్పిటల్ యాజమాన్యం తో మాట్లాడి సుమారు 1 లక్ష యాభై వేలు వరకు బిల్లు అయితే అందులో 1 లక్ష రూపాయిలు తగ్గేలా ప్రత్యేకంగా సిఫార్సు చేశారు.
పార్టీ కార్యకర్తలు, ప్రజలు ఇబ్బందుల్లో ఉంటే సహాయం చేయడంలో
“వెనుక అడుగు వేయని నాయకుడు అని పలువురు చెప్పుకునే
గల్లా సత్య నారాయణ ఈ సందర్భంలో మరొకసారి
సేవే అభిమానం… సేవే తన ధర్మం
అని నిరూపించారు.
ఎటువంటి హంగులు లేకుండా… ప్రచారం అవసరం లేకుండా…
అపదలో ఉన్నవారికి అండగా నిలబడే గల్లా సత్య నారాయణ లాంటి నాయకులు
ప్రజల హృదయాల్లో ఎల్లప్పటికి ప్రత్యేకస్థానం కలిగి ఉంటారు..



