మదనపల్లి ఆగస్టు (పున్నమి ప్రతినిధి)
గురువారం మదనపల్లె మండలం కొత్తవారిపల్లి సమీపంలోని నాలుగు లైన్ల రోడ్డులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో సుమారు 35 సంవత్సరాల వయసున్న గుర్తుతెలియని వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. గుర్తుతెలియని వాహనం బైకును ఢీ కొట్టి వెళ్లిపోవడంతో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. మృతుడి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. స్థానికులు, పోలీసులు ఈ వివరాలను వెల్లడించారు.


