యువత మత్తు పదార్థాలకు బానిస కాకుండా ఉజ్వల భవిష్యత్తును కాపాడుకోవాలని జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా సూచించారు. మత్తు పదార్థాల నియంత్రణపై సమీకృత కలెక్టర్ కార్యాలయంలో అధికారులతో సమీక్ష నిర్వహించారు. పాఠశాలలు, కళాశాలల్లో అవగాహన కార్యక్రమాలు, పోటీలు నిర్వహించాలని ఆదేశించారు. రైల్వే స్టేషన్, బస్టాండ్లలో ప్రచారం, రవాణాపై నిఘా పెంచాలని సూచించారు. దాబాల వద్ద తనిఖీలు కట్టుదిట్టం చేయాలని తెలిపారు. సమావేశంలో పలువురు అధికారులు పాల్గొన్నారు.

మత్తు పదార్థాల నియంత్రణకు కట్టుదిట్టమైన చర్యలు అవసరం: కలెక్టర్ సందీప్ కుమార్ ఝా
యువత మత్తు పదార్థాలకు బానిస కాకుండా ఉజ్వల భవిష్యత్తును కాపాడుకోవాలని జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా సూచించారు. మత్తు పదార్థాల నియంత్రణపై సమీకృత కలెక్టర్ కార్యాలయంలో అధికారులతో సమీక్ష నిర్వహించారు. పాఠశాలలు, కళాశాలల్లో అవగాహన కార్యక్రమాలు, పోటీలు నిర్వహించాలని ఆదేశించారు. రైల్వే స్టేషన్, బస్టాండ్లలో ప్రచారం, రవాణాపై నిఘా పెంచాలని సూచించారు. దాబాల వద్ద తనిఖీలు కట్టుదిట్టం చేయాలని తెలిపారు. సమావేశంలో పలువురు అధికారులు పాల్గొన్నారు.

