మచిలీపట్నం, జూలై 26:ఎస్.పి.వి. గవర్నమెంట్ మెడికల్ కాలేజ్, మచిలీపట్నం లో అనాటమీ (Anatomy) విభాగంలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన మోగంటి వెంకట సాత్విక్ శర్మ గారు బంగారు పతకం (Gold Medal) సాధించారు. విద్యార్ధి ఈ విజయాన్ని తన కృషితో సాధించగా, ఈ గౌరవం కలకాలం గుర్తుండిపోయేలా చేసింది.వెంకట సాత్విక్ శర్మ తల్లిదండ్రులు శ్రీ మోగంటి వెంకట కామేశ్వర రావు గారు మరియు శ్రీమతి శైలజ గారు తన కుమారుని విజయాన్ని చూసి ఆనందానికి అవధులు లేకుండా హర్షం వ్యక్తం చేశారు. విద్యార్థికి ఆశీర్వాదాలు తెలిపిన తన పెద్దనాన్న పెద్దమ్మ ఎంవి జనార్దనరావు, లక్ష్మీ అతని భవిష్యత్తు మరింత ఉజ్వలంగా ఉండాలని ఆకాంక్షించారు.ఇది కళాశాలకి గర్వకారణంగా మారింది. అంతే కాదు, ఇతర విద్యార్థులకు ప్రేరణగా నిలిచింది.




