బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం వల్ల తొట్టంబేడు బి ఎన్ కండ్రిగ మండలాల ప్రజలకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున అప్రమత్తంగాఉండాలని,అవసరం అయితే తప్ప బయటకు రావద్దని,రైతులు పొలాల దగ్గరకి వెళ్ళినప్పుడు కరెంట్ వైర్ల పట్ల జాగ్రత్తగా ఉండాలి,భారీ వర్షాలు కురుస్తున్నందున విద్యుత్ స్తంభాలు,వైర్లకు తాకకుండా తగు జాగ్రత్తలు ప్రజలు తీసుకోవాలని,బి ఎన్ కండ్రిగ సర్కిల్ సీఐ టి.తిమ్మయ్య తెలిపారు.భారీ వర్షాల వల్ల ఉధృతంగా ప్రవహిస్తున్న వాగులు,వంకలు,చెరువులు వద్ద వరద ప్రవాహం అధికంగా ఉన్న చోట వద్దకి ఎవరు వెళ్లవద్దన్నారు.వర్షం నీటి వల్ల రోడ్డుపై వాహనాలు స్కిడ్ అయ్యే ప్రమాదం ఉన్నందున,పరిమిత వేగంతో వాహనాలు నడపాలని సూచించారు .పిల్లలు,యువకులు,చెరువులు,కాలువల దగ్గరకు సెల్ఫీలు తీసుకోవడానికి,ఈత కొట్టడానికి వెళ్లకుండా తల్లిదండ్రులు దృష్టిసారించాలన్నారు.పిడుగులు పడే అవకాశం ఉన్నందున చెట్ల కింద ఉండొద్దన్నారు.

భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి – బి ఎన్ కండ్రిగ సర్కిల్ ఇన్స్పెక్టర్ టి తిమ్మయ్య
బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం వల్ల తొట్టంబేడు బి ఎన్ కండ్రిగ మండలాల ప్రజలకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున అప్రమత్తంగాఉండాలని,అవసరం అయితే తప్ప బయటకు రావద్దని,రైతులు పొలాల దగ్గరకి వెళ్ళినప్పుడు కరెంట్ వైర్ల పట్ల జాగ్రత్తగా ఉండాలి,భారీ వర్షాలు కురుస్తున్నందున విద్యుత్ స్తంభాలు,వైర్లకు తాకకుండా తగు జాగ్రత్తలు ప్రజలు తీసుకోవాలని,బి ఎన్ కండ్రిగ సర్కిల్ సీఐ టి.తిమ్మయ్య తెలిపారు.భారీ వర్షాల వల్ల ఉధృతంగా ప్రవహిస్తున్న వాగులు,వంకలు,చెరువులు వద్ద వరద ప్రవాహం అధికంగా ఉన్న చోట వద్దకి ఎవరు వెళ్లవద్దన్నారు.వర్షం నీటి వల్ల రోడ్డుపై వాహనాలు స్కిడ్ అయ్యే ప్రమాదం ఉన్నందున,పరిమిత వేగంతో వాహనాలు నడపాలని సూచించారు .పిల్లలు,యువకులు,చెరువులు,కాలువల దగ్గరకు సెల్ఫీలు తీసుకోవడానికి,ఈత కొట్టడానికి వెళ్లకుండా తల్లిదండ్రులు దృష్టిసారించాలన్నారు.పిడుగులు పడే అవకాశం ఉన్నందున చెట్ల కింద ఉండొద్దన్నారు.

