శ్రీకాళహస్తి పున్నమి టెంపుల్ న్యూస్, ఫిబ్రవరి 16: శ్రీకాళహస్తి పట్టణంలో మహాశివరాత్రి మహోత్సవాల సందర్భంగా ఘనంగా నిర్వహించిన రథోత్సవంలో భాగంగా, భారతీయ జీవన పరివర్తనం చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ చంద్రప్ప భక్తులకు మజ్జిగ పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రప్ప మాట్లాడుతూ…సమాజ సేవే లక్ష్యంగా “భారతీయ జీవన పరివర్తనం చారిటబుల్ ట్రస్ట్” ను స్థాపించామని వేల సంవత్సరాలుగా భారతదేశం సనాతన ధర్మాన్ని అనుసరిస్తూ, ప్రపంచానికి మార్గదర్శకంగా గురు స్థానంలో నిలిచిందని విదేశీ పరిపాలన కాలంలో మన సంస్కృతి, సంప్రదాయాలు, విలువలు కొంత మేరకు దెబ్బతిన్నాయని, ప్రజలు ఇతర సంస్కృతుల ప్రభావంలోకి వెళ్లారని ఆయన పేర్కొన్నారు. అయితే ప్రస్తుతం మళ్లీ భారతీయ సంప్రదాయాలు, ధర్మం, సంస్కృతి పునరుజ్జీవనం పొందుతున్నాయని విద్య, వైద్యం, విజ్ఞానం, సంస్కృతి, సాహసం, ఆధ్యాత్మికత వంటి అన్ని రంగాల్లో భారతదేశం మళ్లీ ప్రపంచానికి గురువుగా ఎదగాల్సిన అవసరం ఉందని సనాతన ధర్మ విలువలను కాపాడుకుంటూ, యువతలో దేశభక్తి, సేవాభావం పెంపొందించడమే తమ ట్రస్ట్ ప్రధాన లక్ష్యమని ఇలాంటి సేవా కార్యక్రమాల ద్వారా సమాజానికి అండగా నిలుస్తూ, భవిష్యత్తులో మరిన్ని ప్రజాహిత కార్యక్రమాలు చేపడతామని ఆయన వెల్లడించారు. ఈ కార్యక్రమంలో కండ్రిగ ఉమా , ప్రమీలమ్మ , పిల్లారీ బత్తినయ్య, మ్యాగీ క్లారా, తరుణ్, జస్వంత్, ప్రియాంక తదితరులు పాల్గొన్నారు.

భక్తులకు మజ్జిగ పంపిణీచేసిన భారతీయ జీవన పరివర్తన చారిటబుల్ ట్రస్ట్
శ్రీకాళహస్తి పున్నమి టెంపుల్ న్యూస్, ఫిబ్రవరి 16: శ్రీకాళహస్తి పట్టణంలో మహాశివరాత్రి మహోత్సవాల సందర్భంగా ఘనంగా నిర్వహించిన రథోత్సవంలో భాగంగా, భారతీయ జీవన పరివర్తనం చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ చంద్రప్ప భక్తులకు మజ్జిగ పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రప్ప మాట్లాడుతూ…సమాజ సేవే లక్ష్యంగా “భారతీయ జీవన పరివర్తనం చారిటబుల్ ట్రస్ట్” ను స్థాపించామని వేల సంవత్సరాలుగా భారతదేశం సనాతన ధర్మాన్ని అనుసరిస్తూ, ప్రపంచానికి మార్గదర్శకంగా గురు స్థానంలో నిలిచిందని విదేశీ పరిపాలన కాలంలో మన సంస్కృతి, సంప్రదాయాలు, విలువలు కొంత మేరకు దెబ్బతిన్నాయని, ప్రజలు ఇతర సంస్కృతుల ప్రభావంలోకి వెళ్లారని ఆయన పేర్కొన్నారు. అయితే ప్రస్తుతం మళ్లీ భారతీయ సంప్రదాయాలు, ధర్మం, సంస్కృతి పునరుజ్జీవనం పొందుతున్నాయని విద్య, వైద్యం, విజ్ఞానం, సంస్కృతి, సాహసం, ఆధ్యాత్మికత వంటి అన్ని రంగాల్లో భారతదేశం మళ్లీ ప్రపంచానికి గురువుగా ఎదగాల్సిన అవసరం ఉందని సనాతన ధర్మ విలువలను కాపాడుకుంటూ, యువతలో దేశభక్తి, సేవాభావం పెంపొందించడమే తమ ట్రస్ట్ ప్రధాన లక్ష్యమని ఇలాంటి సేవా కార్యక్రమాల ద్వారా సమాజానికి అండగా నిలుస్తూ, భవిష్యత్తులో మరిన్ని ప్రజాహిత కార్యక్రమాలు చేపడతామని ఆయన వెల్లడించారు. ఈ కార్యక్రమంలో కండ్రిగ ఉమా , ప్రమీలమ్మ , పిల్లారీ బత్తినయ్య, మ్యాగీ క్లారా, తరుణ్, జస్వంత్, ప్రియాంక తదితరులు పాల్గొన్నారు.

