బొప్పాయి ధరలు కిలోకు రూ.5కే పడిపోవడంతో చిట్వేల్ రైతులు తీవ్ర ఆవేదనలో మునిగిపోయారు. తమ కష్టపడి పండించిన పంటకు ధర రాకపోతే ఆత్మహత్య తప్పదని వీడియోల ద్వారా హెచ్చరిస్తున్నారు.
జిల్లా కలెక్టర్ రైతులు, అధికారులు, వ్యాపారులు, దళారులతో సమావేశం నిర్వహించి బొప్పాయిని రూ.10 కన్నా తక్కువకు కొనరాదని ఆదేశించినా, దళారులు పట్టించుకోక రైతులను దోచేస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. సబ్ కలెక్టర్ కూడా హెచ్చరించినా పరిస్థితి మారకపోవడంతో రైతుల్లో ఆగ్రహం, నిరాశ పెరిగిపోతున్నాయి.
“మా చెమటను, మా పంటను ఇలా చులకన చేస్తే బ్రతకడం కష్టమే. న్యాయం చేయకపోతే ప్రాణాలు తీసుకోవాల్సిందే” అని రైతులు విలపిస్తున్నారు. ప్రజలు, స్థానిక సంఘాలు అధికారులు వెంటనే జోక్యం చేసుకొని దళారుల దోపిడీని అరికట్టాలని, రైతులకు కనీస న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.


