కోడూరు మండలం బుడిగుంటపల్లి గ్రామంలో శ్రీ వెంకటేశ్వర స్వామివారి కళ్యాణ మహోత్సవం ఘనంగా జరిగింది. గరుడోత్సవం సందర్భంగా రైల్వే కోడూరు నియోజకవర్గం టిడిపి పార్టీ ఇంచార్జ్, కడప అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ ముక్కా రూపానంద రెడ్డి, తన సతీమణి ముక్కా వరలక్ష్మితో కలిసి స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించారు.ఈ సందర్భంగా వేదపండితులు ముక్కా దంపతులను పూర్ణకుంభంతో ఘనంగా ఆహ్వానించారు. గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని ఈ వేడుకను విజయవంతం చేశారు. అనంతరం కళ్యాణోత్సవంలో పాల్గొన్న ముక్కా దంపతులు స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించి ఆశీర్వాదం పొందారు.ఈ సందర్భంగా ముక్కా రూపానంద రెడ్డి మాట్లాడుతూ – “ఇలాంటి ధార్మిక కార్యక్రమాలు సమాజంలో ఆధ్యాత్మిక శక్తిని పెంపొందిస్తాయి. ప్రజలు ఐక్యతతో ముందుకు సాగాలి” అని ఆకాంక్షించారు.

బుడిగుంటపల్లిలో శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవం వైభవంగా
కోడూరు మండలం బుడిగుంటపల్లి గ్రామంలో శ్రీ వెంకటేశ్వర స్వామివారి కళ్యాణ మహోత్సవం ఘనంగా జరిగింది. గరుడోత్సవం సందర్భంగా రైల్వే కోడూరు నియోజకవర్గం టిడిపి పార్టీ ఇంచార్జ్, కడప అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ ముక్కా రూపానంద రెడ్డి, తన సతీమణి ముక్కా వరలక్ష్మితో కలిసి స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించారు.ఈ సందర్భంగా వేదపండితులు ముక్కా దంపతులను పూర్ణకుంభంతో ఘనంగా ఆహ్వానించారు. గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని ఈ వేడుకను విజయవంతం చేశారు. అనంతరం కళ్యాణోత్సవంలో పాల్గొన్న ముక్కా దంపతులు స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించి ఆశీర్వాదం పొందారు.ఈ సందర్భంగా ముక్కా రూపానంద రెడ్డి మాట్లాడుతూ – “ఇలాంటి ధార్మిక కార్యక్రమాలు సమాజంలో ఆధ్యాత్మిక శక్తిని పెంపొందిస్తాయి. ప్రజలు ఐక్యతతో ముందుకు సాగాలి” అని ఆకాంక్షించారు.

