ఖమ్మం మార్చి
(పున్నమి జిల్లా ఇంచార్జి )
ఖమ్మం జిల్లా సత్తుపల్లి పట్టణానికి చెందిన బీజేపీ సీనియర్ నాయకుడు చెక్క మధుసూదన్ రావు అనారోగ్య కారణాలతో సోమవారం మృతి చెందారు. ఆయన మరణ వార్త పార్టీ శ్రేణుల్లో తీవ్ర విషాదాన్ని కలిగించింది.
వారి మృతికి సంతాపం తెలియజేస్తూ బీజేపీ రాష్ట్ర నాయకులు కొందపల్లి శ్రీధర్ రెడ్డి, మాజీ జిల్లా అధ్యక్షులు గల్లా సత్య నారాయణ, జిల్లా అధ్యక్షులు నెల్లూరు కోటేశ్వరరావు, అలాగే ఇవి రమేష్, పాలకొల్లు శ్రీనివాస్, పడిగల మధు, నంబూరి రామలింగేశ్వరావ్, సుదర్శన్ మిశ్రా, నాయుడు రాఘవా తదితరులు ఆయన నివాసానికి చేరుకుని నివాళులు అర్పించారు.
పార్టీ అభివృద్ధికి ఆయన చేసిన సేవలను స్మరించుకుంటూ, వారి కుటుంబ సభ్యులకు ధైర్యం చేకూరాలని ప్రార్థించారు. చెక్క మధుసూదన్ రావు గారి మరణం పార్టీకి తీరని లోటని పేర్కొన్నారు.


