కేసుల పురోగతిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ఉన్నతాధికారులకు నివేదించాలి..కోర్ట్ మానిటరింగ్ సిబ్బంది, కోర్టు కానిస్టేబుళ్లతో సమీక్షా సమావేశంలో దిశానిర్దేశం చేసిన జిల్లా అదనపు ఎస్పీ (పరిపాలన) శ్రీ.యం. వెంకటాద్రి సకాలంలో సాక్షులను కోర్టులో హాజరుపర్చి బాధితులకు న్యాయం జరిగేలా, సాక్ష్యాధారాలతో నేర నిరూపణ చేసి నిందితులకు శిక్ష పడేలా కృషి చేయాలని జిల్లా జిల్లా ఎస్పీ శ్రీ.వి.విద్యాసాగర్ నాయుడు ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు, జిల్లా అదనపు ఎస్పీ (పరిపాలన) శ్రీ.యం.వెంకటాద్రి గారు కోర్ట్ మానిటరింగ్ సిబ్బందికి దిశా నిర్దేశం చేశారు. శనివారం స్థానిక పోలీసు సమావేశ మందిరంలో జిల్లాలోని కోర్టు మానిటరింగ్ సిబ్బంది, పోలీస్ స్టేషన్ లకు చెందిన కోర్టు కానిస్టేబుళ్ల తో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా జిల్లా అదనపు ఎస్పీ గారు మాట్లాడుతూ కేసుల పురోగతిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ఉన్నతాధికారులకు నివేదించాలని ఆదేశించారు. అన్ని ట్రయల్ కేసుల్లో సత్వర, సక్రమ విచారణ జరిగేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కోర్టులలో ఛార్జ్ షీట్ ఫైల్ చేసిన అనంతరం కోర్ట్ ద్వారా సంబంధిత కేసులలో సి.సి నెంబర్లను తీసుకునేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఎప్పటికప్పుడు పెండింగ్ సమన్లు జారీ అయ్యేలా, వారెంట్లు అమలు జరిగేలా తగిన చర్యలు చేపట్టాలని ఆదేశించారు. నూతనంగా అమలులోకొచ్చిన బి.ఎన్.ఎస్.ఎస్ చట్టాలపై అవగాహన పెంపొందించుకోవాలని సూచించారు. కొత్త చట్టం మేరకు కోర్టు ప్రొసీడింగ్స్ జరిగేలా చూడాలని ఆయన ఆదేశించారు. ప్రతి కోర్టు కానిస్టేబుల్ విధిగా తన పోలీస్ స్టేషన్ కు సంబంధించి కోర్టులో హాజరవుతున్న ప్రతి కేసు గురించి అవగాహన పెంచుకుని సరైన సాక్ష్యాధారాలతో నిందితులకు శిక్ష పడేలా చూడాలన్నారు. కోర్టు ట్రయల్ సందర్భంలో సంబంధిత స్టేషన్ హౌస్ అధికారి కూడా సమర్ధవంతంగా కేసు విచారణ జరిగేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సమావేశంలో కోర్టు మానిటరింగ్ సెల్ ఇంచార్జ్ ఇన్స్పెక్టర్ జి. ఆదినారాయణ రెడ్డి, ఎస్ఐ రవికుమార్. కోర్ట్ మానిటరింగ్ సిబ్బంది, కోర్టు కానిస్టేబుళ్లు పాల్గొన్నారు.

బాధితులకు న్యాయం జరిగేలా, నిందితులకు శిక్ష పడేలా కృషి చేయాలి.
కేసుల పురోగతిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ఉన్నతాధికారులకు నివేదించాలి..కోర్ట్ మానిటరింగ్ సిబ్బంది, కోర్టు కానిస్టేబుళ్లతో సమీక్షా సమావేశంలో దిశానిర్దేశం చేసిన జిల్లా అదనపు ఎస్పీ (పరిపాలన) శ్రీ.యం. వెంకటాద్రి సకాలంలో సాక్షులను కోర్టులో హాజరుపర్చి బాధితులకు న్యాయం జరిగేలా, సాక్ష్యాధారాలతో నేర నిరూపణ చేసి నిందితులకు శిక్ష పడేలా కృషి చేయాలని జిల్లా జిల్లా ఎస్పీ శ్రీ.వి.విద్యాసాగర్ నాయుడు ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు, జిల్లా అదనపు ఎస్పీ (పరిపాలన) శ్రీ.యం.వెంకటాద్రి గారు కోర్ట్ మానిటరింగ్ సిబ్బందికి దిశా నిర్దేశం చేశారు. శనివారం స్థానిక పోలీసు సమావేశ మందిరంలో జిల్లాలోని కోర్టు మానిటరింగ్ సిబ్బంది, పోలీస్ స్టేషన్ లకు చెందిన కోర్టు కానిస్టేబుళ్ల తో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా జిల్లా అదనపు ఎస్పీ గారు మాట్లాడుతూ కేసుల పురోగతిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ఉన్నతాధికారులకు నివేదించాలని ఆదేశించారు. అన్ని ట్రయల్ కేసుల్లో సత్వర, సక్రమ విచారణ జరిగేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కోర్టులలో ఛార్జ్ షీట్ ఫైల్ చేసిన అనంతరం కోర్ట్ ద్వారా సంబంధిత కేసులలో సి.సి నెంబర్లను తీసుకునేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఎప్పటికప్పుడు పెండింగ్ సమన్లు జారీ అయ్యేలా, వారెంట్లు అమలు జరిగేలా తగిన చర్యలు చేపట్టాలని ఆదేశించారు. నూతనంగా అమలులోకొచ్చిన బి.ఎన్.ఎస్.ఎస్ చట్టాలపై అవగాహన పెంపొందించుకోవాలని సూచించారు. కొత్త చట్టం మేరకు కోర్టు ప్రొసీడింగ్స్ జరిగేలా చూడాలని ఆయన ఆదేశించారు. ప్రతి కోర్టు కానిస్టేబుల్ విధిగా తన పోలీస్ స్టేషన్ కు సంబంధించి కోర్టులో హాజరవుతున్న ప్రతి కేసు గురించి అవగాహన పెంచుకుని సరైన సాక్ష్యాధారాలతో నిందితులకు శిక్ష పడేలా చూడాలన్నారు. కోర్టు ట్రయల్ సందర్భంలో సంబంధిత స్టేషన్ హౌస్ అధికారి కూడా సమర్ధవంతంగా కేసు విచారణ జరిగేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సమావేశంలో కోర్టు మానిటరింగ్ సెల్ ఇంచార్జ్ ఇన్స్పెక్టర్ జి. ఆదినారాయణ రెడ్డి, ఎస్ఐ రవికుమార్. కోర్ట్ మానిటరింగ్ సిబ్బంది, కోర్టు కానిస్టేబుళ్లు పాల్గొన్నారు.

