బంజారా కాలనీ వ్యవస్థాపకులు
క్రీ.శే. వడ్త్య నరసింహ నాయక్ కి ఘన నివాళులర్పించిన కళ్లెం నవజీవన్ రెడ్డి
పున్నమి న్యూస్ ప్రతినిధి
రంగారెడ్డి జిల్లా
హయత్ నగర్ డివిజన్
02 మార్చ్ 2026
హయత్ నగర్ లోని బంజారా కాలనీ వ్యవస్థాపకులు క్రీ.శే. వడ్త్య నరసింహ నాయక్ 14వ వర్ధంతి సందర్భంగా హయత్ నగర్ తాజా మాజీ కార్పొరేటర్ కళ్లెం నవజీవన్ రెడ్డి కాలనీవాసులతో కలిసి వారి విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ…
శ్రీ వడ్త్య నరసింహ నాయక్ బంజారా కాలనీ అభివృద్ధికి బలమైన పునాది వేసిన మహనీయుడు అని కొనియాడారు. ఆయన దూరదృష్టి, నాయకత్వం వల్లే ఈ కాలనీ నేడు అభివృద్ధి పథంలో ముందుకు సాగుతోందని తెలిపారు. కాలనీ అభ్యున్నతికి ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమని, యువత ఆయనను ఆదర్శంగా తీసుకుని సమాజ సేవలో ముందుండాలని పిలుపునిచ్చారు.
అలాగే కాలనీ అభివృద్ధికి తాను ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటానని, ప్రజల సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమం కాలనీవాసులు బాలూ, కే . శంకర్, కే .జంజ్య, ఎం . రఘుపాపతి, కే . మోహన్, కే .భరత్, బి . చిరంజీవి, జి . బాలూ, జై . పంతు, ఎం . మోహన్, శంకర్, అమ్మాల్, శివ, బి .పణ్య, సకూరు, కే . లక్ష్మణ్, కైలాష్ మరియు కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు..
హయత్ నగర్ డివిజన్






