ప్రొద్దుటూరు పట్టణంలోని ట్రాఫిక్ సమస్యలపై శుక్రవారం సాయంత్రం మున్సిపల్ కార్యాలయంలో MLA వరదరాజుల రెడ్డి అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. ASP విభుకృష్ణ, మున్సిపల్ కమిషనర్ రవిచంద్రారెడ్డి, షేక్ వెల్ఫేర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ ముక్తియార్, టిడిపి రాష్ట్ర కార్యదర్శి నంద్యాల కొండారెడ్డి, సీఐలు కొండారెడ్డి, వంశీనాథ్, రామాంజనేయులు, రాజగోపాల్, ఇతర సంబంధిత అధికారులు పాల్గొన్నారు.





