ప్రవేట్ స్కూల్ నిర్లక్ష్యం
ప్రభుత్వ పాఠశాల విద్యార్థినికి తీరని అన్యాయం
🫵 విద్యార్థినికి జరిగిన ప్రమాదం పై స్పందించని ప్రైవేటు పాఠశాలల యాజమాన్యం
🙏 న్యాయం కోసం, సహాయం కోసం ఎదురుచూస్తున్న బాలిక కుటుంబం
విషయం:- గ్రామం- మాదాయ పల్లి, మండలం- తలకొండపల్లి, జిల్లా- రంగారెడ్డి కి చెందిన మదిగట్ల పద్మ w/o గోవర్ధన్ గార్ల కూతురు ప్రసన్న సమీప గ్రామమైన వెల్జాల్ గ్రామంలో ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఆరవ తరగతి చదువుతున్నది మాదాయ పల్లి నుండి వెల్జల్ గ్రామానికి ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థినీ విద్యార్థులకు
మాదాయ పల్లి నుండి ఎలాంటి వాహన సౌకర్యం లేనందున
మాదాయ పల్లి నుండి వెల్జల్ గ్రామ ప్రభుత్వ ఉన్నత పాఠశాలకు సమయానికి తీసుకువెళ్లి తీసుకురావడానికి బులోరో వాహనాన్ని మాట్లాడుకున్నాము గడచిన( 3 ) మూడు సంవత్సరాల నుండి ఇదే వాహనంలో ప్రయాణం చేస్తున్నారు కాగా గడచిన తేదీ 16/ 10/ 2025 రోజున సాయంత్రం స్కూలు నుండి తిరిగి వెళ్లే దారిలో వాహనాన్ని రోడ్డు సైడ్ కి నిలిపివేయడం జరిగింది ఈ క్రమంలో
వెల్జాల్ గ్రామంలో నిర్వహిస్తున్న ప్రైవేటు పాఠశాల
మెగా శ్రీ సాయి విద్యాలయానికి
సంబంధించిన బస్సు అతివేగంతో వచ్చి ఆగి ఉన్న బొలెరో వాహనాన్ని వెనకాల నుండి ఢీకొట్టడంతో ఆ వాహనంలో ఉన్న మద్దిగట్ల ప్రసన్న కి చెయ్యి విరిగిపోవడం జరిగింది
ఈ విషయం పైన ప్రైవేటు పాఠశాలల నిర్వహణను చూసుకుంటున్న ప్రభుత్వ ఉన్నతాధికారులు
ఎంఈఓ
గారికి ఫిర్యాదు చేయగా ప్రైవేటు స్కూల్ యాజమాన్యం పైన గాని బస్సు పైన గాని ఎలాంటి చర్యలు తీసుకోకుండా గత పది రోజుల నుండి కాలయాపన చేస్తూ ప్రైవేటు పాఠశాలల యాజమాన్యానికి మద్దతుగా ఉన్నారు మరియు మా సమస్యని ప్రింట్ మీడియా గానీ ఎలక్ట్రానిక్ మీడియా గానీ మా సమస్యను పట్టించుకోవడం లేదు
దయచేసి నా కూతురికి జరిగిన అన్యాయానికి నాపైన నా కూతురి పైన దయవుంచి న్యాయం చేయగలరని కోరుతూ
ఇట్లు
ఒక నిరుపేద రైతు


