Monday, 23 March 2026
  • Home  
  • ప్రమాదంలో మరణించిన వ్యక్తి కుటుంబానికి ఆర్థిక సాయం
- నాగర్‌కర్నూల్

ప్రమాదంలో మరణించిన వ్యక్తి కుటుంబానికి ఆర్థిక సాయం

పున్నమి ప్రతినిధి నగర్ కర్నూల్ జిల్లా సెప్టెంబర్ 29 బిజినేపల్లి మండలం నంది వడ్డేమాన్ గ్రామానికి చెందిన ఏటవాళీ రవి వనపర్తి ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. ఈనెల 26 తారీఖున తన సొంత పనిమీద వనపర్తికి స్కూటీపై వెళ్తున్న సమయంలో తాడ్పర్తి దగ్గర అదుపుతప్పి చెట్టుకు గుద్దుకొని ప్రమాదానికి గురి కావడం జరిగింది. వెంటనే వనపర్తి ఏరియా హాస్పిటల్ తరలించడం చికిత్స పొందుతూ మరణించడంతో విషయం తెలుసుకున్న శెట్టి రాజేష్ కుమార్ జనపల్లి విష్ణువర్ధన్ రెడ్డి కుటుంబాన్ని పరామర్శించి ఆయన భార్య లక్ష్మి కి 5000 వేల ఆర్థిక సాయం అందజేశారు. వారం రోజుల క్రితం ఆ కుటుంబంలోని తండ్రి అనారోగ్యంతో మరణించారు. కుటుంబం పూర్తి పేదరికంలో ఉన్నందున, తండ్రి మరణించడం, ప్రమాదంలో కొడుకు మరణించడం దీంతో ఆ కుటుంబం పని చేసుకుంటే తప్ప పూట గడవదు, దిక్కుతోచని పరిస్థితి ఏర్పడింది. గ్రామంలో ఎవరికి ఏ సమస్య వచ్చినా వెంటనే ఆ కుటుంబాన్ని పరామర్శించడం వాళ్ళ ఆర్థిక పరిస్థితి తెలుసుకొని శెట్టి రాజేష్ కుమార్ జనంపల్లి విష్ణువర్ధన్ రెడ్డి మానవత్వంతో తనకు తోచినంత ఆకుటుంబాలకు ఆర్థిక సహాయం చేస్తున్నాడు. ఇలా సహాయం చేసే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారని గ్రామస్తులు అంటున్నారు. పేదరికంలో ఉన్న కుటుంబాలకు సహాయం చేసే వాళ్ళు ముందుకు రావాలని శెట్టి రాజేష్ కుమార్ విష్ణువర్ధన్ రెడ్డి అన్నారు. మృతునికి ఇద్దరు చిన్న పిల్లలు ఉన్నారు. ఈ కార్యక్రమంలో ఉప్పిగంటి యాదయ్య జెనగ చిన్నయ్య జక్కి వీరస్వామి కారుకొండ వెంకటేష్ ఏటావలి చంద్రశేఖర్ పాల్గొన్నారు

పున్నమి ప్రతినిధి నగర్ కర్నూల్ జిల్లా సెప్టెంబర్ 29
బిజినేపల్లి మండలం నంది వడ్డేమాన్ గ్రామానికి చెందిన ఏటవాళీ రవి వనపర్తి ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. ఈనెల 26 తారీఖున తన సొంత పనిమీద వనపర్తికి స్కూటీపై వెళ్తున్న సమయంలో తాడ్పర్తి దగ్గర అదుపుతప్పి చెట్టుకు గుద్దుకొని ప్రమాదానికి గురి కావడం జరిగింది. వెంటనే వనపర్తి ఏరియా హాస్పిటల్ తరలించడం చికిత్స పొందుతూ మరణించడంతో విషయం తెలుసుకున్న శెట్టి రాజేష్ కుమార్ జనపల్లి విష్ణువర్ధన్ రెడ్డి కుటుంబాన్ని పరామర్శించి ఆయన భార్య లక్ష్మి కి 5000 వేల ఆర్థిక సాయం అందజేశారు. వారం రోజుల క్రితం ఆ కుటుంబంలోని తండ్రి అనారోగ్యంతో మరణించారు. కుటుంబం పూర్తి పేదరికంలో ఉన్నందున, తండ్రి మరణించడం, ప్రమాదంలో కొడుకు మరణించడం దీంతో ఆ కుటుంబం పని చేసుకుంటే తప్ప పూట గడవదు, దిక్కుతోచని పరిస్థితి ఏర్పడింది. గ్రామంలో ఎవరికి ఏ సమస్య వచ్చినా వెంటనే ఆ కుటుంబాన్ని పరామర్శించడం వాళ్ళ ఆర్థిక పరిస్థితి తెలుసుకొని శెట్టి రాజేష్ కుమార్ జనంపల్లి విష్ణువర్ధన్ రెడ్డి మానవత్వంతో తనకు తోచినంత ఆకుటుంబాలకు ఆర్థిక సహాయం చేస్తున్నాడు. ఇలా సహాయం చేసే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారని గ్రామస్తులు అంటున్నారు. పేదరికంలో ఉన్న కుటుంబాలకు సహాయం చేసే వాళ్ళు ముందుకు రావాలని శెట్టి రాజేష్ కుమార్ విష్ణువర్ధన్ రెడ్డి అన్నారు. మృతునికి ఇద్దరు చిన్న పిల్లలు ఉన్నారు. ఈ కార్యక్రమంలో ఉప్పిగంటి యాదయ్య జెనగ చిన్నయ్య జక్కి వీరస్వామి కారుకొండ వెంకటేష్ ఏటావలి చంద్రశేఖర్ పాల్గొన్నారు

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.