నెల్లూరు డిసెంబర్ (పున్నమి ప్రతినిధి)
మూలపేట నెల్లూరు నందు ఉన్న ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో నిర్వహిస్తున్న సోషల్ ఆడిట్ సర్వేను సిఎంఓ గోగుల రమణయ్య పరిశీలించారు. ఈ సందర్భంగా పాఠశాల నిర్వహణ, మౌలిక సదుపాయాలు, విద్యార్థులకు అందుతున్న సౌకర్యాలపై ఆయన వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వ పథకాలు సక్రమంగా అమలవుతున్నాయా లేదా అన్న అంశంపై సమీక్ష నిర్వహించారు. నాణ్యమైన విద్య అందించడంలో సోషల్ ఆడిట్ కీలక పాత్ర పోషిస్తుందని ఆయన తెలిపారు. అధికారులు, ఉపాధ్యాయులకు అవసరమైన సూచనలు చేశారు.


